టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 1న శ్రీ చక్రత్తాళ్వార్‌ శాత్తుమొర, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణన్‌ శాత్తుమొరను ఘనంగా నిర్వహించనున్నారు. 3న శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీవారి పాదాల మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు. తిరిగి వచ్చే క్రమంలో చిన్నజీయర్‌స్వామి మఠానికి చేరుకుని ఆస్థానం చేపడతారు.


 4న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.
 7న ఆడి స్వాతి రోజున సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.
 9న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. 12న తులసి మహత్యం ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు గరుడ వాహనంపై దర్శనమిస్తారు. 14న శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.


 15న శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉదయం 6.30 గంటలకు శ్రీవారు, శ్రీ కృష్ణస్వామివారు కపిలతీర్థంలోని ఆళ్వార్‌ తీర్థానికి వేంచేపు చేస్తారు. తిరిగి సాయంత్రం ఆలయానికి చేరుకుంటారు.16, 31వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. 23న గోకులాష్టమి ఆస్థానం. 24న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. 26న చిన్నవీధి ఉట్లోత్సవం సందర్భంగా సాయంత్రం 7 గంటలకు శ్రీవారు, శ్రీకృష్ణస్వామివారు మాడ వీధుల్లో భక్తులను కటాక్షిస్తారు.

27న పెద్దవీధి ఉట్లోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీవారు, శ్రీకృష్ణస్వామివారు మాడ వీధుల్లో భక్తులను కటాక్షిస్తారు.
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 1న శ్రీ చక్రత్తాళ్వార్‌ శాత్తుమొర, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణన్‌ శాత్తుమొరను ఘనంగా నిర్వహించనున్నారు. 3న శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీవారి పాదాల మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు. తిరిగి వచ్చే క్రమంలో చిన్నజీయర్‌స్వామి మఠానికి చేరుకుని ఆస్థానం చేపడతారు.


 4న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.
 7న ఆడి స్వాతి రోజున సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.
 9న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. 12న తులసి మహత్యం ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు గరుడ వాహనంపై దర్శనమిస్తారు. 14న శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.


 15న శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉదయం 6.30 గంటలకు శ్రీవారు, శ్రీ కృష్ణస్వామివారు కపిలతీర్థంలోని ఆళ్వార్‌ తీర్థానికి వేంచేపు చేస్తారు. తిరిగి సాయంత్రం ఆలయానికి చేరుకుంటారు.16, 31వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. 23న గోకులాష్టమి ఆస్థానం. 24న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. 26న చిన్నవీధి ఉట్లోత్సవం సందర్భంగా సాయంత్రం 7 గంటలకు శ్రీవారు, శ్రీకృష్ణస్వామివారు మాడ వీధుల్లో భక్తులను కటాక్షిస్తారు. 27న పెద్దవీధి ఉట్లోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీవారు, శ్రీకృష్ణస్వామివారు మాడ వీధుల్లో భక్తులను కటాక్షిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: