వియ్యంకుడి చెప్పుడు మాటలు విని మహామంత్రి తిమ్మరసు కళ్ళు పీకించాడు శ్రీ క్రిష్ణ దేవరాయలు.
 
తన సొంత ఖర్చులు కోసం టోపీ లు కుట్టుకునే  ఔరంగజేబు చెప్పుడు మాటలు విని అధికారం కోసం కన్న తల్లి తండ్రులని బంధించాడు.తల్లి గర్భం లో చనిపోబోయే బిందుసారుడి ని తన ఉపాయం తో బతికిస్తే చివరికి చెప్పుడు మాటలు విని బిందుసారుడే చాణక్యుడి మరణానికి కారణం అయ్యాడు.


చెప్పుడు మాటలు విని కురు సామ్రాజ్యం పై పగ పెంచు కున్నాడు శకుని. అదే శకుని చెప్పుడు మాటలు విని ధ్రుతరాష్టుడు పాండవులపై యుద్ధం చేసి సర్వం కోల్పోయారు కౌరవులు. 
చెప్పుడు మాటలు విని రావణా బ్రహ్మ అంతటి మాహా జ్ఞానే సీతమ్మ తల్లి ని అపహరించి రాముడి తో యుద్ధానికి దిగి రాక్షసుడు అయ్యాడు.


చెప్పుడు మాటలు విని స్నేహాన్ని కోల్పోయిన వారు కొందరు. చెప్పుడు మాటలు విని సంసారాలని నాశనం చేసుకున్నవారు మరికొందరు. చెప్పుడు మాటలు విని అధికారాన్ని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. 
శకుని చెప్పుడు మాటలు వినటం వలన హస్తినాపుర మహా సామ్రాజ్యమే సర్వనాశనం అయింది. మనమెంత..? మనతో  ఉంటూ చెప్పుడు మాటలు చెప్పే శకుని లాంటి వాళ్ళతో అప్రమత్తం గా లేకపోతే ఎంతటివారికైనా అపజయం కలుగుతుంది అని చరిత్ర మరియూ పురాణాలు చెప్తున్న నగ్న సత్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: