మనం ఎదైన టెంపుల్‌కు వెళ్లినప్పుడు అక్కడ తప్పక తీర్ధప్రసాదాలు ఇస్తారు.సాధారణంగా ఆలయాల్లోనే కాదు ఇంట్లో ఏవైన పూజలు జరిగిన గాని తీర్ధ ప్రసాదాలు తప్పని సరిగ్గా వుంటాయి.అయితే చాల మందికి తెలియని విషయమేంటంటే తీర్ధ ప్రసాదాలు ఎందుకు తీసుకోవాలి.ఇంతకు ఈ తీర్ధం స్వీకరించడంలో ఎన్నిరకాలు ఉన్నాయన్న విషయం అతి తక్కువ మంది భక్తులకు మాత్రమే తెలుసు,ఇంకా అందరికి తెలియాలి కదా అందుకే అలాంటి వారికోసమే ఇప్పుడు ఈ విషయం.మరి అవేంటో తెలుసుకుందామా.. 



తీర్ధ ప్రసాధాల్లో నాలుగు రకాలు ఉంటాయి.అవేంటంటే 
1.జల తీర్ధం
2.కషయ తీర్ధం
3.పంచామృత తీర్ధం
4.పానకా తీర్ధం
జల తీర్ధం:ఈ తీర్ధం ద్వార అకాల మరణం,సర్వ రోగాలు నివారించబడుతాయి.అన్ని కష్టాలకు,ఉపసమనాన్ని ఇస్తాయి.బుద్ధి,అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడి నియంత్రిస్తుందట.
కషాయ తీర్ధం:ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీమహాలక్ష్మిదేవాలయం,కొల్లూరు ముకాంబిక దేవాలయం,హిమాచలప్రదేశ్ లోని జ్వాలమాలిని దేవాలయం,అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు.రాత్రి పూజ తరువాత తీర్దాన్ని కషాయం రూపంలో పంచుతారు.వీటిని స్వీకరించడం ద్వారా కంటికి కనిపెంచే అంతర్గతంగా కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయిట....



పంచామృత అభిషేక తీర్థం:పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తికావటం మరియు బ్రహ్మలోకంప్రాప్తిస్తుందట .
పానకా తీర్ధం:శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి,అహోబిలం నరసింహ స్వామికి,పానకం నైవేధ్యంగా పెట్టడంతో పానకాల స్వామిగా ,పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు ..కారణం స్వామికి పానకాన్ని నైవేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు.ఇక ఈ పానకా తీర్ధాన్ని సేవిస్తే....
దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది.కొత్త చైతన్యం వస్తుంది.దేహంలో వుండే వేడి సమ స్ధితికి వచ్చే విధంగా చేస్తుందట.రక్తపోటు ఉన్నవారికి,తల తిరగడం,నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదట.అంతేకాదు,ఎముకలకు సంబందించిన వ్యాధులు నయం అవుతాయట.నీరసం దరిచేరదు.ఆకలి బాగా వేస్తుంది.దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వార మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది.జీవితంలో శత్రువుల బాధ ఉండదట,బుద్ది చురుకుగా పని చేసి,జ్ఞాపకశక్తి పెరుగుతుందట.
చూసారుగా నాలుగు మంత్రాలు చదివి ఇచ్చే తీర్ధాలతో ఎన్ని ఉపమోగాలున్నాయో..

మరింత సమాచారం తెలుసుకోండి: