ఏప్రిల్ నాటికి వెలిగొండ మొదటి సొరంగం పూర్తి చేయడానికి తిరుపతి తిరుమల దేవస్థానం ప్రత్యేక శ్రద్ధను కేంద్రేకరించింది.ఇందుకు ఈ ఏడాది రూ.485 కోట్ల టిటిడి విడుదల చేసింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో  సీఈ, ఎస్ ఈలు  భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లావాసుల ఆశల సౌధమైన వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2020 ఏప్రిల్ నాటికి పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకొని కృషి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ అధికారులను కోరారు. బుధవారం తాడేపల్లి లోని ఆయన నివాసంలో సీఈ జలందర్, ఎస్ ఈ వీర్రాజు సుబ్బారెడ్డితో భేటీ అయ్యారు.



మొదటి సొరంగం 18.8 కిలో మీటర్లకు గాను ఇప్పటిదాకా 17.3 కిలో మీటర్లు, రెండో సొరంగం 11.2 కిలో మీటర్లు పూర్తయినట్లు అధికారులు నివేదించారు. ప్రస్తుతం జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలు తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.  ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని గత ప్రభుత్వ హయాంలో తాను పాదయాత్ర చేసిన విషయాన్ని అధికారులకు గుర్తు చేశారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఏడాది రూ.485 కోట్లు విడుదల చేసినట్లు వైవీ తెలిపారు.




వెలిగొండ రిజర్వాయర్ నుంచి కంభం చెరువు, పామూరు సమీపంలోని మోపాడు రిజర్వాయర్లను నింపేట్లు కాలువలు డిజైన్ చేయాలని సుబ్బారెడ్డి అధికారులకు సూచించారు. అలాగే గుండ్లకమ్మ ప్రాజెక్టు, యర్రం చిన్న పోలిరెడ్డి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మిగిలి ఉన్న కొద్దిపాటి పనులను పూర్తి చేసి ఆయకట్టు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో సాగు, తాగు నీరందించాలని సుబ్బారెడ్డి కోరారు. పనులను వేగంగా పూర్తి చేయాలని సుబ్బారెడ్డి సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: