"ప్రాతస్స్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్
ఆకర్ణదీర్ఘనయనం మణి కుండలాధ్యం
 మందస్మితం మృగ మదోజ్వల ఫాలదేశమ్"
పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టానదేవతగా లలిత త్రిపురసుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీ దేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దార్రిద్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్యాభీష్టాలను ఈమె సిద్ధింపజేస్తుంది. శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు దసరా ఉత్సవాలలో 5వ రోజు గురువారం శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు.


శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూవుండగా చిరుమందహాసంతో, వాత్సల్య జితోష్ణలను చిందిస్తూ , చెరకుగడను చేతపట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని శ్రీలలితా త్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు. త్రిపురేశ్వరుడుగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తులచేత పూజలందుకొంటారు.త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె


ఈ రోజు అత్యంత శోభాయమానంగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహామండపం పై వున్న మహాగోపురం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన దుర్గమ్మను శ్రీశ్రీశ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా అలంకరిచడం, ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలు ,  పూలమాలలు, తోరణాలతో విశేషం గా అలంకరణ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: