ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ: మంత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ: మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అన్ని రంగాల్లోనూ సమృద్ధి సాధిస్తారు.
ఓం శ్రీం శ్రీ అయే నమ: మంత్రాన్ని పలకడం వల్ల సంతోషం లభిస్తుంది.
ఓం మహాదేవ్యేచ విద్మహే, విష్ణు పత్నేచ దీమహే... తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేది లక్ష్మీ గాయత్రి మంత్రం.
ఈ మంత్రం వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు.పైవాటితోపాటు ఓ శ్రీంగ్ హ్రింగ్ క్లీంగ్ ఐంగ్ సంగ్.. ఓ హ్రింగ్ కా ఏ ఈ లే... హ్రింగ్ హసా కా హ ల హ్రింగ్ సకల్... హ్రింగ్ సౌంగ్ ఐంగ్, క్లీంగ్ హ్రింగ్ శ్రీంగ్ ఓం అనే ప్రత్యేక మంత్రాన్ని 108 సార్లు ఉచ్ఛరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ధన వస్తు లాభంతోపాటు మానసిక, శారీరక అనారోగ్యాలు సమసిపోతాయి. అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయి.శ్రీ మహాలక్ష్మీ కోటి కుంకుమార్చన, శ్రీ మహాలక్ష్మీకి 108 కలువ పువ్వులతో పూజలు చేస్తే పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.
అవివాహితులకు అందమైన యువతి/ యువకులు జీవిత భాగస్వామిగా లభిస్తారు.పూజ గదిలో గానీ, ఆలయంలో గానీ కూర్చుని వీటిని ఉచ్చరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వీలును బట్టి ఈ మంత్రాలను ఎన్నిసార్లయినా పఠించవచ్చు. అయితే ఒక్కోదాన్ని 108 సార్లు జపించారు. అలాగే దీపావళి నుంచి మొదలుపెట్టి 40 రోజులపాటు క్రమం తప్పకుండా ఉచ్చిరిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. కానీ మీ లక్ష్యం పదిరోజులే అయినా గణనీయమైన లబ్ది కలుగుతుంది.