శ్రీమహా విష్ణువు వామనావతారుడై కృతయుగంలో రాక్షసరాజు బలి చక్రవర్తిని పాతాళానికి అణచివేశాడు. అది బలిపాలన అంతమైన రోజు. ఆ రోజున దీపావళిని జరుపుకున్నారు.ఇక ద్వాపర యుగంలో నరకాసురుణ్ణి వధించిన రోజునే దీపావళిగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి వధించి తిరిగి ఆ రోజు అయోధ్యలో ప్రవేశించిన శుభదినం.
దీపావళి పర్వదినం రోజు ఆ జగన్మాత మహాలక్ష్మీదేవిని సర్వోపచారాలతో పూజిస్తారు. దీపావళి పర్వదినం రోజున ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజించడానికి గల కారణాలు ఏంటంటే?
ఈ దీనస్థితి నుంచి గట్టెక్కేందుకు ఇంద్రుడు శ్రీహరిని స్తుతించగా.. ఒక దీపాన్ని వెలిగించి దాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించమని చెప్పాడు. ఆ పూజలు ఆచరించిన దేవేంద్రునిపై లక్ష్మీదేవి కరుణాకటాక్షం లభించింది. దీంతో ఇంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందగలిగాడు. ఇంకా దేవలోకాధిపత్యం లభించింది.
అందుకే ..మూడవ రోజున సాయంకాలం ధనలక్ష్మీ పూజను చేసి దీపములను వెలిగించి ఇంటినంతటినీ దీపములతో అలంకరించాలి.ఈ దీపముల వరుసలతో అలంకరించుకుంటాము కనుక ఈ రోజును దీపావళి అంటారు. అలాగే సత్యభామదేవి నరకుని సంహరించిన రోజు నరక చతుర్దశి. ఆ ఆనందపు పండగే దీపావళి అని అందుకే మనం బాణసంచా వెలిగిస్తామని అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇక్కడితో ఆశ్వీయుజంలో చివరి ఈ మూడు రోజుల పండగ వల్ల మన పితరులకు ఉత్తమ లోక ప్రాప్తి, మనకు ధనలక్ష్మీ అనుగ్రహం లభిస్తాయన్నమాట.