ఓం నమో వేంకటేశాయ!!


• ఈ రోజు సోమవారం,21.10.2019 ఉదయం 5 గంటల సమయానికి,తిరుమల: 19C°-24℃°.


• నిన్న 83,343 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.


• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 01 గదిలో భక్తులు వేచి ఉన్నారు.


 • ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనాని కి సుమారు  03 గంటలు పట్టవచ్చును.


• నిన్న 31,446 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.15 కోట్లు.


•  శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.


 గమనిక:

అక్టోబ‌రు 30 తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఉ: 9 నుండి మ:1.30 వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.


అక్టోబరు 29న వృద్ధులు,దివ్యాంగులకు ప్రత్యేక ఉచిత దర్శనం (భక్తులు రద్దీ సమయాల్లో ఇబ్బంది పడకుండా ఈ అవకాశం సద్వినియోగంచేసుకోగలరు)


వయోవృద్దులు / దివ్యాంగులకు ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి.ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.


చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు


• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,


మరింత సమాచారం తెలుసుకోండి: