దక్షిణాప్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టు సరీస్‌లో ఆడుతున్న అశ్విన్  చెన్నైలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తన కుటుంబ పరిస్థితి గురించి ఆందోళన పడ్డాడు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెన్నైఅతలాకుతలమైన విషయం తెలిసిందే. అశ్వన్ చెన్నై వాసి కావడంతో తన బంధువులకు, కుటుంబ సభ్యులకు ఎలా ఉందన్న టెన్షలో ఉన్నాడట. కాగా  దక్షిణాప్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టు సరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా విజయ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచారు.

అయితే రహానేతో అశ్విన్ బ్యాటింగ్ చేసే ముందు ఆయన భార్య పృథ్వీ అశ్విన్ ట్వీట్ చేశారు. తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని తెలపడంతో.. చాలా సంతోషంలో ఉన్నాడట.  తన భార్య కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నట్లు అశ్విన్ భార్య పృథ్వీ అశ్విన్ ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నట్లు ఆమెకు వాట్సప్ సమాచారం అందింది.


వరదల్లో చిక్కుకున్న చెన్నై వాసులు


వరదల్లో చిక్కకున్న వారి కోసం సహాయం చేస్తున్న అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అంతే కాదు తాను కడా చెన్నై చేరుకుని తగిన సాయం అందిస్తానని అశ్విన్ చెప్పాడు. తాను కూడా కొంత కాలంగా చెన్నైలో ఉంటున్నానని, ఇంతకు ముందు ఇటువంటి వరదలు చూడలేదని మురళీ విజయ్ అన్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: