ఐపిఎల్ 2017లో ఎవరు ఏ మ్యాచ్ ను ఎలా టర్న్ చేస్తారో తెలియట్లేదు. పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్ లో ఉన్న కలకత్తా జట్టు సెకండ్ లీస్ట్ లో ఉన్న గుజరాత్ పై ఓడిపోయింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న గుజరాత్ 20 ఓవర్లలో 187 పరుగులు ఇచ్చారు. రాబిన్ ఊతప్ప 72 పరుగులతో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడగా ఓపెనర్లు సునీల్ నరైన్ 42, కెప్టెన్ గౌతం గంభీర్ 33 పరుగులు చేశారు. 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది కలకత్తా జట్టు.


ఇక నిర్ణీత ఓవర్లలో 188 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ జట్టు ఓపెనర్లు ఫించ్ 31, మెక్ కల్లం 33 చేయగా కెప్టెన్ ఇన్నింగ్ తో సురేష్ రైనా 84 పరుగులు చేశాడు. ఇక లక్ష్య ఛేధనలో గుజరాత్ 18.2 ఓవర్లకే 6 వికెట్ల తేడాతో 188 పరుగుకు చేసింది.    



మరింత సమాచారం తెలుసుకోండి: