ఈ ఐపిఎల్ లో ఊహించని విధంగా జట్ట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నాయి. అయితే కొన్ని జట్లు మాత్రం అదే రేంజ్ లో అతి తక్కువ స్కోర్ తో చెత్త్ రికార్డ్ నమోదు చేసుకుంటున్నాయి. జరిగిన ఢిల్లి, పంజాబ్ మ్యాచ్ లలో ఢిల్లి జట్టు కేవలం 67 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ 4 వికెట్లు తీశాడు. ఢిల్లి జట్టులో హయ్యెస్ట్ స్కోర్ కోరె అండర్ సన్ 18 పరుగులు మాత్రమే. 17.1 ఓవర్లలోనే ఢిల్లి 67 పరుగులకు ఆలౌట్ అయ్యింది.


ఇక అతి తక్కువ లక్ష్యమే కాబట్టి పంజాబ్ జట్టు వికెట్ కూడా నష్టపోకుండా 68 పరుగులు చేసింది. గుప్ టిల్ 50, ఆషిం ఆంలా 16 పరుగులతో కేవలం 7.5 ఓవర్లలోనే పంజాబ్ లక్ష్యం ఛేధించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: