ఐపిఎల్ 2017 10వ సీజన్ లో అన్ని మ్యాచ్ లు వన్ సైడ్ వార్ గా ముగిస్తున్నాయని అనిపించింది. కాని ఈరోజు జరిగిన ఢిల్లి డేర్ డెవిల్స్ వర్సెస్ గుజరాత్ లయన్స్ టీం ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లి గుజరాత్ కు 208 పరుగులు ఇచ్చిది. గుజరాత్ జట్టులో కెప్టెన్ సురేష్ రైనా 77, దినేష్ కార్తిక్ 65 పరుగులు చేశారు. ఆరోన్ ఫించ్ 27, రవింద్ర జడేజా 17 పరుగులు చేసి నిర్ణీత ఓవర్లలో జట్టుకి 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు వచ్చేలా చేశారు.


ఇక భారీ లక్ష్యం కోసం బరిలో దిగిన ఢిల్లి జట్టు ముందు నుండి దూకుడు ఆటతీరుని ప్రదర్శించింది. ఓపెనర్ సామ్ సన్ 61 పరుగులు చేయగా రిషాబ్ ప్యాంట్ 97 పరుగులు చేసి మ్యాచ్ నిలబెట్టాడు. మ్యాచ్ చివర్లో అవుట్ అయినా అప్పటికే ఢిల్లి చేతుల్లోకి మ్యాచ్ వచ్చేసింది. ఫైనల్ గా 17.3 ఓవర్లకే కేవలం 3 వికెట్లకే 214 పరుగులు చేశారు ఢిల్లి ఆటగాళ్లు. గుజరాత్ పై 7 వికెట్ల తేడాతో ఢిల్లి మ్యాచ్ విన్ అయ్యింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: