వెస్టిండీస్ సీరీస్ కైవసం చేసుకున్న టీం ఇండియా జట్టు ఇప్పుడు ఎంతో పఠిష్టతగా ఉంది అంటున్నాడు కెప్టెన్ విరాట్ కొహ్లి. ఇక టాప్ ఆర్డర్ తో పాటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మన్ లో కేదార్ జాదవ్, హార్ధిక్ పాండ్య లాంటి విధ్వంసకర బ్యాట్స్ మన్స్ దొరకడం అదృష్టమని అన్నాడు. అయితే వారిద్దరిని 3,4 స్థానాల్లో ఆడించలేమని అన్నాడు కొహ్లి.


కేదార్, పాండ్య ఇద్దరు తమ సత్తా మిరూపించుకోవాలని తహతహలాడుతున్నారు. జట్టు ఉపయోగకరం అన్న వాటి మీదే అందరు దృష్టి పెట్టాలని అందుకే వారిద్దరికి కాన్ఫిడెన్స్ నింపుతున్నామని అన్నారు. అంతేకాదు వారి ప్రదర్శనపై ఎంతో నమ్మకం ఉందని అలాంటి ఆటగాళ్లు దొరికినందుకు సంతోషమని అన్నాడు కొహ్లి.   



మరింత సమాచారం తెలుసుకోండి: