క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఐపీఎల్ -11 సీజన్ రానే వచ్చేసింది..అంచనాలకి మించి ఒకరి తరువాత మరొకరు అత్యద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తున్నారు..అయితే ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడుగా ఎప్పుడు టాప్ ప్లేస్ లో నిలిచే కోహ్లీని ఇప్పుడు రైనా దాటేశాడు,

 Image result for suresh raina

ఐపీఎల్‌ 11 లో అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా మరొకసారి టాప్‌ ప్లేస్ కి   చేరాడు. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రైనా 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 54 పరుగులు చేశాడు. అయితే రైనాకి ఇది 32వ ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీ కాగా, మొత్తం 4,658 పరుగులు సాధించాడు. దాంతో అత్యధిక ఐపీఎల్‌ పరుగులు చేసిన క్రికెటర్లలో విరాట్‌ కోహ్లిని అధిగమించిన రైనా టాప్‌ ప్లేస్‌కు చేరాడు.

 Image result for virat kohli

అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ 4,649 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. గౌతం గంభీర్‌ నాల్గో స్థాంనలో ఉన్నాడు  ప్రధానంగా ఐపీఎల్ టాప్‌ ప్లేస్‌ కోసం  కోహ్లి-రైనాల మధ్య భారీ పోటీనే జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: