మహరాష్ట్రకు చెందిన యువ క్రికెటర్ రాకేష్ పవార్ దారుణ హత్యకు గురయ్యారు.  కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని దారుణంగా నరికి చంపారు.  ముంబాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర క్రికెట్ టీమ్ లో ఉన్న రాకేష్.. రంజీ జట్టులో స్థానం దక్కించుకునేందుకు కొంత కాలంగా ప్రయత్నాలు చేూస్తున్నాడు.

నిన్న రాత్రి బందప్ ప్రాంతంలో ఓ ఫ్యూయల్ స్టేషన్ కు పెట్రోల్ కోసం రాకేశ్ వచ్చాడు. ఉన్నట్టుండి అక్కడకు కొంతమంది వచ్చి రాకేష్ పై అతి దారుణంగా దాడి చేసి చంపారు.

అయితే ఈ హత్య అతను అంటే గిట్టని వారు చేశారు..లేక ఇతర వ్యవహారాలు కారణమా అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఈ నేపథ్యంలో మీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని, దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: