ప్రపంచకప్‌లో భాగంగా భారత్ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ జరిగిందా? ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా ప్రవర్తన చూసిన వారు అవుననే అంటున్నారు. జంపా తన ప్రవర్తనతో అభిమానుల్లో అనుమానాలు రేకెత్తించాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో పదేపదే జేబులో చేతులు పెట్టుకుని తడమడం, ఆపై బంతిని రుద్దుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


గతంలో కొంత మంది ఆటగాళ్లు ఇదే రీతిలో ప్రవర్తించడం..అది ట్యాంపరింగ్ అని నిర్థారించడం జరిగింది.  తాాజాగా జంపా బౌలింగ్ చేస్తున్న సమయంలో పదేపదే జేబులో చేతులు పెట్టుకుని తడమడం, ఆపై బంతిని రుద్దుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జంపా కచ్చితంగా బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఉంటాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.  కాగా, గతేడాది కూడా ఆసీస్ బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్ ప్రపంచం ముందు అభాసుపాలైంది.


దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో బంతిని ట్యాంపరింగ్ చేసిన ఆసీస్ ఆటగాళ్లు బెన్‌క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్‌పై ఐసీసీ నిషేధం కూడా విధించింది.  ప్రస్తుతం నిషేధం పూర్తవడంతో ఈ ప్రపంచకప్‌లో వార్నర్, స్మిత్‌లకు అవకాశం దక్కింది. ఇప్పుడు జంపా ప్రవర్తన మరోమారు అనుమానాలకు తావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: