టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం తన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 17 సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన భారత జట్టు సాధించిన ఎన్నో ఘన విజయాల్లో కీలక వ్యక్తిగా ఉన్నాడు. 2011లో భారత జట్టు ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కానీ... 2007 20 - 20 ప్రపంచకప్ క్రికెట్ సాధించడంలో వెలకట్టలేనిది. ఈ క్రమంలోనే యువరాజ్ టీమిండియాలో స్టార్ క్రికెటర్గా ఉన్నప్పుడు బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నాడని పుకార్లు షికార్లు చేశాయి. వీరిలో కొందరు హీరోయిన్లతో నిజంగానే ప్రేమాయణం కొనసాగించినా... మరికొందరితో చనువుగా ఉండడంతో వాళ్లతో కూడా ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.
యువరాజ్ ముందుగా తెలుగులో వచ్చిన ఖడ్గం సినిమాలో హీరోయిన్గా నటించిన కిమ్ శర్మతో డేటింగ్ కొనసాగించాడు. నాలుగు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన వీరిద్దరూ 2007లో విడిపోయారు. తర్వాత కొద్దిరోజులకే తెలుగులో పవన్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమాలో హీరోయిన్గా చేసిన ప్రీతిజింగానియాతో స్వల్ప కాలం కలిసి ఉండి తర్వాత ఒకరికొకరు దూరమయ్యారు. తర్వాత యువరాజ్ ఐపీఎల్ మ్యాచ్ లలో పంజాబ్ జట్టు సహా యజమానిగా ఉన్న బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రీతి జింటా తో డేటింగ్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రతి మ్యాచ్లోనూ వీరిద్దరూ కలిసి సన్నిహితంగా తీసుకున్న ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత యువరాజ్ పంజాబ్ కు దూరం కావడంతో ప్రీతి జింటాకు కూడా దూరమయ్యాడు.
ఇక యూవీ ఎక్కువగా డేటింగ్ చేసిన బాలీవుడ్ హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరు. 2007 తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. యువరాజ్ ఆడే ప్రతి మ్యాచ్ కి దీపికా వచ్చి అతడికి మద్దతుగా నిలిచేది. యూవీ పుట్టినరోజు వేడుకలు కూడా దీపిక సెలబ్రేట్ చేయడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉన్నట్టు అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు కూడా విడిపోయారు.దీపికతో బ్రేకప్ తర్వాత యువరాజ్ బెంగాలీ బ్యూటీ రియాసేన్తో కొంత కాలం డేటింగ్ చేశాడు. తెలుగులో నితిన్ హీరోగా వచ్చిన ధైర్యం సినిమాలో నటించింది.
ఇక మనీషా లంబ కూడా యువరాజ్ జీవితంలోకి అడుగుపెట్టింది. మనిషాను యువరాజ్ ముద్దు పెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ కూడా యూవీతో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. 2011 ప్రపంచకప్ మ్యాచ్ల సమయంలో అమీషా కోసం ప్రత్యేకంగా టికెట్లు బుక్ చేసేవాడన్న రూమర్లు వచ్చాయి.
ఆ తర్వాత యూవీ తెలుగులో పలు సినిమాల్లో నటించిన నేహ ధూపియా, ఆ తర్వాత సోఫియా చౌదరితో కూడా ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఇక చివరగా 2015లో బాలీవుడ్ నటి హజెల్ కీచ్తో ఎంగేజ్మెంట్ చేసుకుని 2016లో ఆమెను వివాహం చేసుకున్నాడు. హజెల్ తెలుగులో కిక్, కృష్ణం వందే జగద్గురుం లాంటి సినిమాల్లో నటించింది