అందరి  మనసుల్ని గెలుచుకుంటున్న విరాట్ కోహ్లీ... మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు ఒక ప్రముఖ భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. తన ఆటతీరుతో  అతి తక్కువ సమయం లోనే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. 


        మైదానం లో ఎందరివో మనసులని కొల్లగొట్టిన కోహ్లీ .ఇంగ్లాండ్ ప్లేయర్ సారాహ్ టేలర్ మనసు గెలిచాడు కానీ అది ప్రొఫషనల్ వరకు మాత్రమే తరువాత బాలీవుడ్ అందాల భామ అనుష్క  శర్మ మనసు కొల్లగొట్టిన కోహ్లీ తనని వివాహం చేసుకున్నాడు.  తాజాగా పాకిస్థాన్‌కు చెందిన షాహబాజ్ షరీఫ్ ఖాస్మీ అనే క్రికెట్ అభిమాని కోహ్లీ మా దేశంలో క్రికెట్ ఆడితే చూడాలని ఉందంటూ ప్లకార్డుని ప్రదర్శిస్తూ తన మనసులో ఉన్న మాటని చెప్పాడు.



     దాసన్ షణక సారథ్యంలోని శ్రీలంక జట్టు ప్రస్తుతం పాకిస్థాన్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం ఆఖరి మ్యాచ్ లాహోర్‌లోని గఢాఫీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో షాహబాజ్ షరీఫ్ ఖాస్మీ ప్రదర్శించిన ఓ ఫ్లకార్డు క్రికెట్ అభిమానుల అందరిని  ఆకట్టుకుంది."విరాట్ కోహ్లీ మీరు పాకిస్థాన్‌లో ఆడితే చూడాలని ఉంది" అని రాసి ఉన్న ప్లకార్డుని పట్టుకుని స్టేడియం మొత్తం తిరిగాడు . ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.



      "విరాట్‌.. మీరు పాకిస్థాన్‌కు వచ్చి ఇక్కడ మ్యాచ్‌ ఆడతారని ఆశిస్తున్నా అని తన అభిమానాన్ని అందరికి తెలిసేలా తన ట్విట్టర్ లో ట్వీట్ చేసి తెలిపాడు . చూడాలి ఆ వీర అభిమాని యొక్క ఆశ తీరుతుందో లేదో .పుల్వామా దాడుల తర్వాత పాకిస్తాన్ తో సంబంధాలు మరింతగా దిగజారిపోయాయి దీని వలన క్రికెట్ పాకిస్తాన్ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి




మరింత సమాచారం తెలుసుకోండి: