కెప్టెన్ కూల్గా పేరున్న భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి కొన్ని మ్యాచ్ల సందర్భాల్లో కోపం, అసహనం వచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మహీనే ఇటీవల తెలియచేయడం జరిగింది. అయితే జట్టు కోసం వాటిని నియంత్రించుకున్నానని తెలియచేశారు. అందరూ క్రికెటర్లలానే మైదానంలో నాకు కోపం, అసహనం వస్తాయని తెలుపుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. కానీ భావోద్వేగాలు నియంత్రించుకోగలనని తెలిపాడు. ఇటీవల జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన ఈ క్రికెటర్.. తన కెరీర్లోని పలు ఆసక్తికర విషయాలు తెలియచేసాడు.
అందరిలానే నాకూ భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఇతరుల కంటే వాటిని బలంగా నియంత్రించుకోగలను నేను అని తెలిపాడు ధోని. మైదానంలో ఎన్నోసార్లు నిరాశకు గురయ్యాను. కోపం, అసహనం వచ్చేవి. నాకి ఆ క్షణంలో నా భావోద్వేగాల కంటే జట్టును ముందుకు నడిపించడమే ముఖ్యం అని పించేది అని అన్నాడు. అప్పుడు వాటిని అధిగమించి మ్యాచ్పై దృష్టి సారిస్తాను. తర్వాత బంతిని ఎవరికి అందివ్వాలి? బరిలోకి ఎవరిని దించాలి? అనే వాటి గురించి ఆలోచనలో ఉంటాను అని తెలిపాడు. ఆ తర్వాత భావోద్వేగాల గురించి నేను మర్చిపోతాను అని అన్నాడు ధోని.
క్రికెట్లో ఫార్మాట్ల బట్టి నిర్ణయాలను తీసుకోవాలి. టెస్టులో రెండు ఇన్నింగ్స్లు ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేందుకు సమయం ఉంటుంది. టీ20 ఇందుకు పూర్తి భిన్నం. ఏదైనా క్షణాల్లోనే తీసుకోవాలి. కొన్ని పొరపాట్ల వల్ల ప్రణాళికలు ఫలించకపోవచ్చు. అయితే ప్రత్యర్థిపై గెలవడమే అంతిమ లక్ష్యం" అని తన స్టైల్లో-మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు.
ప్రపంచకప్లో న్యూజిలాండ్తో సెమీస్లో ఆడిన ధోనీ.. ఆ తర్వాత క్రికెట్కు తాత్కాలిక విరామం పలికాడు. వెస్టిండీస్ పర్యటనకు దూరం కావడం జరిగింది. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతోన్న దక్షిణాఫ్రికా సిరీస్కు మహీ అందుబాటులో లేడు అని అందరికి తెలుస్తుంది. అయితే డిసెంబరులో తిరిగి మైదానంలోకి అడుగు పెడ్తాడు అని సమాచారం ఉంది.