అలాగే ఫార్మట్ లకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ధోని పేర్కొన్నాడు. టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్ లు ఉంటాయి కాబట్టి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా సమయం ఉంటుంది కానీ పరిమిత ఓవర్ల క్రికెట్ లో అలా కాదు ఏ నిర్ణయమైన క్షణాల్లో తీసుకోవాలి కొని సార్లు ఆ నిర్ణయాలు సత్పలితాలు ఇవ్వక్కపోవచ్చునని అని ధోని అన్నాడు. ఇక ప్రపంచ కప్ తరువాత ధోని తాత్కాలికంగా ఆటకు విరామం ఇచ్చాడు. అందులో భాగంగా ఇటీవల వెస్టిండీస్ పర్యటనుండి వైదొలిగిన ధోని .. తాజాగా దక్షిణాఫ్రికా తో జరిగిన టీ 20 సిరీస్ నుండి కూడా తప్పుకున్నాడు. అలాగే రానున్న బంగ్లాదేశ్ సిరీస్ కు కూడా ధోని అందుబాటులో వుండకపోవచ్చుననితెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈనెల 24న సెలెక్టర్ల తో జరుగనున్న సమావేశంలో ధోని భవితవ్యంపై చర్చిస్తామని నూతన బీసీసిఐ అధ్యక్షుడు గంగూలీ అన్నాడు.