అతి త్వరలో జరగనున్న టి10 లీగ్లో టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు టోర్నమెంట్ చైర్మన్ షాజీ ఉల్ ముల్క్ తెలియచేసారు. అబుదాబి వేదికగా నవంబర్ 15 నుంచి 24 వరకు జరగబోతున్న మూడో సీజన్ టీ10 టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఇటీవల జరిగిన ఆటగాళ్ల డ్రాఫ్టింగ్లో టీమిండియా జట్టు నుంచి ఒకరిని కూడా ఎంపిక చేయలేదు అంటే నమ్మండి.
ఇక ఇదే విషయమై షాజీ ఉల్ ముల్క్ వారి స్పందన తెలుపుతూ... బీసీసీఐ నిమామాలను అనుసరిస్తూ భారత్ జట్టు నుంచి రిటైర్ అయిన ఆటగాళ్లను మాత్రమే తీసుకుంటున్నట్లు అయినా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ విషయమై యువరాజ్ సింగ్తో చర్చలు కూడా జరిపామని, టోర్నిలో అతడ్ని ఆడించేందుకు ప్రయత్నం చేస్తాము అని తెలిపారు. ఈ విషయంపై పూర్తి వివరాలు త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాము అని అయినా తెలియచేసారు.
ఇక డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్సింగ్ ఈ సంవత్సరం జూన్లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సంగతి అందరికి తెలిసిందే కదా. ఇప్పటికే యూవీ కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20 లీగ్లో పాల్గొనడం కూడా జరిగింది. టీ20 లీగ్ యూవీ మంచి ప్రదర్శననే నమోదు చేయడం కూడా చోటు చేసుకుంది.
తాజాగా అబుదాబి టీ10 లీగ్లో ఆడేందుకు యూవీ అంగీకరిస్తే అతని అభిమానులకు మాత్రం ఒక పెద్ద శుభవార్తే అవుతుంది. కాగా, ఈ లీగ్లో
శ్రీలంక స్టార్ ఆటగాళ్లు లసిత్ మలింగ, తిసార పెరీర, నిరోషన్ డిక్వెల్లా, ఇంగ్లడ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ, పాక్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆడనున్నట్లు తెలియాచేశారు. టి10 లీగ్లో యూవీ అడుగు పెడితే మాత్రం టీమిండియాకు పండగే ఇంకా....