సౌతాఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తో  అందరి అంచాలను తలకిందులు చేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.  ఈ సిరీస్ ప్రారంభం ముందు వరకు  రోహిత్ అభిమానులకు కూడా   ఎక్కడో కొద్దిగా అనుమానం టెస్టుల్లో  నిలదొక్కుకుంటాడో లేదోనని.. తన  సత్తా ఏంటో ప్రపంచ కప్ ద్వారానే తెలిసినా .. టెస్ట్ ఫార్మాట్ లో  రోహిత్ ట్రాక్ రికార్డు అంత గొప్పగా లేకపోవడం అలాగే  ప్రపంచ కప్ తరువాత  ఫామ్ కోల్పోవడంతో  విమర్శకులు  టెస్ట్ ల్లో రోహిత్  క్లిక్ అవ్వడం కష్టమే  అని తేల్చేశారు. వీటికి తోడు  సౌతాఫ్రికా తో జరిగిన  ప్రాక్టీస్ మ్యాచ్ లో  కూడా  రోహిత్ డకౌట్ కావడంతో  విమర్శలు ఎక్కువైయ్యాయి.   అయితే సరిగ్గా వారం రోజుల వ్యవధిలో  వైజాగ్ టెస్ట్ లో  రెండు ఇన్నింగ్స్ ల్లో రెండు సెంచరీలు చేసి  రోహిత్ విమర్శకుల నోర్లు మూయించాడు. 



ఇక ఆ టెస్ట్ లో  రోహిత్ దూకుడు  చూసి అతను టీం ఇండియా కు మరో సెహ్వాగ్ అవుతాడనే కామెంట్లు కూడా వచ్చాయి.  తాజాగా వాటిని నిజం చేస్తూ  రాంచి  టెస్ట్ లో రోహిత్ మరోసారి చెలరేగిపోయాడు. కేవలం 250 బంతుల్లోనే అతను  కెరీర్ లో మొదటి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు.  ఇంతకుముందు సెంచరీలకు చేరువలో వున్నపుడు తన స్టైల్లో  సెహ్వాగ్  సిక్సర్ల తో వాటిని పూర్తి చేశేవాడు. ఇప్పుడు రోహిత్ కూడా అదే  స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు.  రాంచి టెస్ట్ లో సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసిన రోహిత్ .. ద్విశతకాన్ని కూడా  అదే స్టైయిల్లో పూర్తి చేశాడు.  ఇక ఈ రోజు సెహ్వాగ్  బర్త్ డే కావడం విశేషం. అలా కెరీర్ లో టెస్టుల్లో  మొదటి డబుల్ సెంచరీ తో  ఓపెనర్ రోహిత్ శర్మ మాజీ ఓపెనర్ సెహ్వాగ్ కు  మరిచిపోలేని బర్త్ డే గిఫ్ట్  ఇచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: