ఇక వీటితో పాటు టీమిండియా ను ఇన్నింగ్స్ తేడాతో అత్యధిక టెస్ట్ లు గెలిపించిన భారత్ కెప్టెన్ గా కోహ్లీ , ధోని సరసన నిలిచాడు. ఇంతకుముందు భారత్.. ధోని కెప్టెన్సీ లో 9 సార్లు ఇన్నింగ్స్ తేడాతో గెలువగా రాంచి టెస్ట్ తో తాజాగా కోహ్లీ సారథ్యంలో కూడా అదే తరహాలో 9 సార్లు విజయాల సాధించింది. అలాగే మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇప్పటివరకు మూడు సార్లు ప్రత్యర్థి జట్లను వైట్ వాష్ చేసిన భారత కెప్టెన్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అందులో భాగంగా 2016లో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ 3-0 తో క్లీన్ స్వీప్ చేయగా 2017లో శ్రీలంక పై , తాజాగా 2019 లో సౌతాఫ్రికా ను వైట్ వాష్ చేసింది. ఇక ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ నెంబర్ 2 స్థానం లో కొనసాగుతుండగా గత రెండేళ్ల నుండి అతను వన్డే ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానంలో కొనసాగుతూ సరిలేరు నీకెవ్వరు అని అనిపించుకుంటున్నాడు.