టీమిండియా క్రికెటర్ల కోసం తాజాగా బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకుంది. ప్రతి మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికీ దేశీయ విమానాల్లో బిజినెస్ క్లాస్ లో ప్రయాణించే వెసులుబాటును కలిపిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు కెప్టెన్ ,ప్రధాన కోచ్ ల కు మాత్రమే ఈ సౌలభ్యం ఉండేది. దాంతో మిగితా క్రికెటర్లు సహాయక సిబ్బంది ఎకానమీ క్లాస్ లో ప్రయాణించే వారు.
ఇక తాజాగా బీసీసీఐ ఇచ్చిన బంపర్ ఆఫర్ ను భారత పేసర్లు షమీ , ఇషాంత్ ఇప్పటికే వాడుకున్నారు. వైజాగ్ టెస్ట్ లో అద్భుతప్రదర్శన చేసిన తర్వాత షమీ
బిజినెస్ క్లాస్ లో కూర్చుని ప్రయాణించగా అంతకుముందే ఇశాంత్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. మాములుగా బిజినెస్ క్లాస్ సీట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆటగాళ్ళందరికి ఆ సీట్ల ను కేటాయించడం కుదరనిపని. దాంతో కెప్టెన్ కోచ్ లకు మాత్రమే అందులో కి ఎంట్రీ ఉండేది. ఇక ఇప్పుడు తాజా నిర్ణయంతో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు కూడా ఆ సీట్లలో కూర్చొని ప్రయాణించనున్నారు. అలాగే వైస్ కెప్టెన్ లకు కూడా సూట్ రూమ్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. దాంతో రహానే ,
రోహిత్ లకు బిజినెస్ క్లాస్ లో ప్రయాణించనున్నారు.