భారతీయులందరు బెంగాల్ టైగర్, దాదా అని ముద్దుగా పిలుచుకునే  భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తప్పకుండా బీసీసీఐ అధ్యక్షుడు అవుతాడని 2007 సంవత్సరంలోనే వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశాడట. ఈ విషయాన్ని తాజాగా సెహ్వాగ్ దీనిని బయటకు తెచ్చాడు. ఇటీవల బీసీసీఐ ఎన్నికలు జరగగా దేశంలోని రాష్ట్ర క్రికెట్ సంఘాల మద్దతు కూడగట్టిన దాదా ఏకగ్రీవంగా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న విషయం అందరికి తెలిసిందే. గంగూలీ తెగువ, ఒత్తిడిని అధిగమించే తత్వాన్ని చూసి పన్నెండు ఏళ్ల క్రితమే అతను గొప్ప స్థాయికి ఎదుగుతాడని తాను అంచనా వేసినట్లు వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.


దాదాను బీసీసీఐ అధ్యక్షుడు అని మొదట వినగానే నాకు 2007లో దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన ఒక ఘటన గుర్తుకొచ్చింది. ఆ టూర్‌ లో కేప్‌ టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు జరుగుతుండగా నేను, వసీమ్ జాఫర్ ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకున్నాం. దీనితో సచిన్ టెండూల్కర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌‌ కి వచ్చాడు. అయితే అతను స్వేచ్ఛగా ఆడలేకయాడు. అయితే మరో ఎండ్‌ లో సఫారీలకి ఎదురు నిలిచిన సౌరవ్ గంగూలీ ఒత్తిడిని ఎదిరిదిస్తూ బ్యాటింగ్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌ చూసిన తర్వాత కేవలం సౌరవ్ గంగూలీ మాత్రమే అలా తెగువ చూపగలడు అని నాకు అనిపించింది. ఆ రోజే డ్రెస్సింగ్ రూములో మేమందరం ఒకటి అనుకున్నాం. అది ఏమిటంటే ఈ జట్టులో ఎవరైనా బీసీసీఐ అధ్యక్షుడు కాగలరంటే, అది దాదా మాత్రమే అవుతాడని. 


ఆ సమయంలో నేను మరొకటి కూడా చెప్పా, అది గంగూలీ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా అవుతాడని. ప్రస్తుతానికి నా అంచనా ఒకటి నిజమైంది. మరొకటి ఎప్పుడు జరుగుతుందో..? చూడాలి’ అని సెహ్వాగ్ తనదయిన శైలిలో వెల్లడించాడు. 1956 తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా ఓ భారత క్రికెటర్ ఉండటం ఇదే మొదటి సారి.బీసీసీఐ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీ, భారత మాజీ క్రికెటర్లతో సమావేశమవుతూ దేశంలో క్రికెట్‌ అభివృద్ధి‌కి వారి సహకారాన్ని కోరుతున్నాడు ఈ బెంగాల్ టైగర్.


అలానే దేశవాళీ క్రికెటర్ల వేతనాలు, మ్యాచ్‌ల పెంపుపై కూడా త్వరలోనే గంగూలీ ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 2017 నుంచి గాడి తప్పిన బీసీసీఐ పాలనని మళ్లీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఈ కొత్త  బీసీసీఐ అధ్యక్షుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: