ఐసీసీ టీ- 20 ల్లో గత కొద్ది రోజులుగా భారత కెప్టెన్
విరాట్ కోహ్లీ, ఓపెనర్
రోహిత్ శర్మ మధ్య నెం.1 స్థానం కోసం పోటీ గట్టిగా నడుస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ - 20 సిరీస్లో
కోహ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకోగా ఇప్పుడు
రోహిత్ శర్మ ఆ రికార్డ్ పై మళ్లి కన్నేశాడు.
బంగ్లాదేశ్ తో ఆదివారం నుంచి మూడు టీ - 20 ల సిరీస్ లో టీమిండియా తలపడనుండగా ఈ సిరీస్ నుంచి కోహ్లీకి రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు
రోహిత్ శర్మ చేతికి టీమ్ పగ్గాలు అప్పగించిన విషయం అందరికి తెలిసిందే. దీనితో
అంతర్జాతీయ టీ - 20 ల్లో ప్రస్తుతం టాప్ స్కోరర్గా ఉన్న కోహ్లీని
రోహిత్ శర్మ అధిగమించే సూచనలు స్పష్టంగా ఉన్నాయి.
అంతర్జాతీయ టీ - 20 ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాని ఓసారి పరిశీలిస్తే..? భారత కెప్టెన్
విరాట్ కోహ్లీ ప్రస్తుతం 67 ఇన్నింగ్స్ ల్లో 2,450 పరుగులతో నెం.1 స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో
రోహిత్ శర్మ 90 ఇన్నింగ్స్ ల్లో 2,443 పరుగులతో ఉన్నాడు. దీనితో బంగ్లాదేశ్ తో జరగనున్న మూడు టీ- 20 సిరీస్ లో
రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు చేస్తే చాలు అతనికి అగ్రస్థానం దక్కనుంది.
కోహ్లీ, రోహిత్ తో పాటు మార్టిన్ గప్తిల్ (2,285 పరుగులు), షోయబ్
మాలిక్ (2,263), బ్రెండన్ మెక్కలమ్ (2,140) టాప్ - 5 లో ఉన్నారు.
బంగ్లాదేశ్ తో టీ - 20 సిరీస్ కోసం శుక్రవారం ప్రాక్టీస్ చేస్తూ
రోహిత్ శర్మ గాయపడడం జరిగింది. బంతి బలంగా వచ్చి అతని పొట్టపై తగిలింది. కానీ, ఈ గాయం తీవ్రమైనది కాదని, ఆదివారం అతను తొలి టీ - 20 లో ఆడతాడని టీమిండియా మేనేజ్ మెంట్ స్పష్టం చేసింది.