టెస్టు ఫార్మాట్లో ఓపెనర్గా విజయవంతమైన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ.. బంగ్లాదేశ్తో
టీ20 సిరీస్కు మంచి జోష్లో ఉన్నాడు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం తొలి
టీ20 ఢిల్లీలోని
అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి
టీ20 జరగనుంది.గత
జనవరి నుంచి విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న రెగ్యులర్ కెప్టెన్
విరాట్ కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో రంగం లో రోహిత్ శర్మను దింపారు .దీనితో
రోహిత్ శర్మకి సారథ్య పగ్గాలు అప్పచెప్పారు.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక పాత ఫోటోను ఒకటి పంచుకున్నాడు. ఈ ఫోటోకు
రోహిత్ శర్మ .. ఈ విధంగా ‘ మాతో పాటు జ్లటాన్ ఉన్నాడు. అతడితో ఛాటింగ్ చేయడం చాలా సరదాగా అనిపించింది’ అంటూ కామెంట్ పెట్టాడు.
రోహిత్ శర్మ పోస్టు చేసిన ఫోటోలో అతడితో పాటు
రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మలు ఉన్నారు.
అయితే,
రోహిత్ మాత్రం జాట్లాన్ అని ట్వీట్ చేశాడు.మరి జ్లటాన్ అని ఎవరిని అన్నట్టు , జ్లటాన్ ఎవరో కాదు. స్వీడన్ మాజీ స్టార్ పుట్ బాల్ ప్లేయర్. జ్లటాన్ అనగానే సాకర్ అభిమానులకు ఠక్కున గుర్తుకు వచ్చేది అతడి పోనీటైల్.
అయితే,
రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఫోటోలో ఇషాంత్ శర్మ అతడిలాగే పోనీ టైల్తో ఉండటంతో జ్లటాన్ అని సంబోధించాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆదివారం భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి
టీ20 అరుణ్జైట్లీ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్కు వాయు కాలుష్య ప్రభావం ఉండటంతో ఇరు జట్ల క్రికెటర్లు కాస్త ఆందోళనలో ఉన్నారు. కాకపోతే ఇది
టీ20 మ్యాచ్ కావడంతో పెద్దగా ఇబ్బందులు రావని అనుకుంటున్నారు.