తొలి మ్యాచ్ లో ఎదురైన పరాజయం నుంచి న్యూజిలాండ్ జట్టు తేరుకుంది. రెండో టి20 మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకొని ఇంగ్లండ్ పై 21 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు మ్యా చ్ సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఆదివారం జరిగిన ఈ రెండో టీ20 మ్యాచ్ లో తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు సాధించడం జరిగింది.


 గప్టిల్ (28 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్ లు), నీషమ్ (22 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్ లు), గ్రాండ్ హోమ్ (12 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్స్ లు), రాస్ టేలర్ (24 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్) ధాటిగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ మూడు వికెట్లు, స్యామ్ కరన్ రెండు వికెట్లు పడగొట్టారు. 


177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. మోర్గాన్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్ లు), మలాన్ (29 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిలు), జోర్డాన్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్స్లు ) దూకుడుగా ఆడినా కీలకదశలో అవుటవ్వడంతో ఇంగ్లండ్ లక్ష్యానికి దూరంగా నిలిచాడు.


న్యూజిలాండ్ బౌలర్లలో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' సాట్నెర్ (3/25) దక్కించుకోవడం జరిగింది. ఈ మ్యాచ్ లో కివీస్ ఫీల్డర్ గ్రాండ్ హోమ్ నాలుగు క్యాలు తీసుకోగా... ఇంగ్లండ్ ఫీల్డర్లు ఆరు క్యాచ్ లను నేలపాలు చేయడం జరిగింది. దీనితో న్యూజిలాండ్ జట్టు  సభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
మొత్తానికి సిరీస్ ని సమం చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: