ఐసీసీ టీ 20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ రిలీజ్ చేసింది. తాజాగా మొత్తం 14 దేశాల మ‌ధ్య క్వాలీఫ‌యింగ్ పోటీలు ముగియ‌డంతో ఇప్పుడు ఐసీపీ మెయిన్ డ్రా రిలీజ్ చేసింది. మొత్తం 16 దేశాలు పాల్గొనే ఈ టోర్న‌మెంట్ వచ్చే యేడాది ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు జరగనుంది. అయితే ఎక్కువ చిన్న‌దేశాలు ఈ క‌ప్‌కు అర్హ‌త సాధించ‌డంతో బోర్ లేకుండా ఐసీపీ కొత్త ఫార్మాట్ ప్ర‌వేశ పెట్టింది.
ఇందుకోసం ముందుగా అక్క‌డ కూడా క్వాలీఫ‌యింగ్ పోటీలు ఉంటాయి. అంటే తొలిద‌శ‌లో గెలిచిన రెండు జ‌ట్లు సూప‌ర్ 12కు అర్హ‌త సాధిస్తాయి.

ఇందుకు రెండు గ్రూపులుగా చిన్న జ‌ట్లు విడిపోయి త‌ల‌ప‌డ‌నున్నాయి. గ్రూప్ ‘ఎ’లో శ్రీలంక, న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్ ఉండగా, గ్రూప్ ‘బి’లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల్లో అగ్ర స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సూపర్-12 కు చేరుతాయి.


ఇక గ్రూప్ ఏ లో టాప్ ప్లేస్‌లో ఉన్న జ‌ట్టు, గ్రూప్ బి లో రెండో స్థానంలో ఉన్న జ‌ట్లు సూపర్ -12 దశలో గ్రూప్- 1 లో చేరతాయి. ఈ గ్రూపులో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఉన్నాయి. అంటే మ‌రో రెండు జ‌ట్లు యాడ్ అయితే ఈ గ్రూపులో మొత్తం 6 జ‌ట్లు ఉంటాయి. ఇక గ్రూప్ బి లో తొలిజట్టు, గ్రూప్ ఎ లో రెండో స్థానంలో ఉన్న జట్టు సూపర్ -12 దశలో గ్రూప్-2 లో జట్లతో తలపడతాయి. ఈ గ్రూప్ లో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్ల‌తో పాటు అర్హ‌త జ‌ట్లు క‌లిసి మొత్తం 6 జ‌ట్లు ఉంటాయి.


ఈ టోర్నీలో తొలి మ్యాచ్ అక్టోబర్ 18న గీలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో శ్రీలంక, ఐర్లాండ్ మధ్య జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ మెల్ బోర్న్ లోని ఎంసీజీ మైదానంలో జరుగనుంది.  


సూపర్-12 దశలో భారత్ ఆడే మ్యాచ్‌ల వివ‌రాలు :


భారత్ x దక్షిణాఫ్రికా, అక్టోబర్ 24న  వేదిక పెర్త్, పెర్త్ స్టేడియం సా. 4.30గం. నుంచి ప్రారంభం


భారత్ x క్వాలిఫయర్, అక్టోబర్ 29న, వేదిక మెల్ బోర్న్, మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం, మ. 1.30గం. నుంచి  ప్రారంభం


భారత్ x ఇంగ్లాండ్, నవంబర్ 1, వేదిక  మెల్ బోర్న్, మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం, మ.1.30 గం. నుంచి ప్రారంభం


భారత్ x క్వాలిఫయర్, నవంబర్ 5, వేదిక అడిలైడ్, అడిలైడ్ ఒవల్ మైదానం, మ.2 గం. నుంచి ప్రారంభం


భారత్ x అఫ్గానిస్థాన్, నవంబర్ 8, వేదిక సిడ్నీ, సిడ్ని క్రికెట్ మైదానం, మ.1.30 గం. నుంచి ప్రారంభం.


మరింత సమాచారం తెలుసుకోండి: