'అతను ఎక్కడున్నా రాజేరా' అని బాహుబలి 2  లో ప్రభాస్ ను ఉదేశిస్తూ  బిజ్జలదేవ (నాజర్) చెప్పిన  డైలాగ్ గుర్తిందిగా... ఇప్పుడు ఈ డైలాగ్ తమ అభిమాన క్రికెటర్ , టీంఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని కి కరెక్ట్ సరిపోతుందని  అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  ప్రపంచకప్ తరువాత  ప్రస్తుతం ధోని  క్రికెట్ కు తాత్కాలికంగా  విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. మొన్న ఆ మధ్యన రాంచి లో జరిగిన  టెస్ట్ లోడ్రెసింగ్ రూమ్ లో కనిపించి సందడి చేశాడు ధోని.  అయితే విరామం  తీసుకున్నా కానీ  మరోవైపు రిటైర్మెంట్  ప్రకటించనున్నాడని  పుకార్లు  వస్తున్న కూడా ధోని  క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. 



ఇందుకు  ఉదాహరణ తాజాగా ఢిల్లీ లో ఇండియా -బంగ్లాదేశ్ లమధ్య  జరిగిన  మొదటి టీ 20 మ్యాచ్చే. ఈమ్యాచ్ లో భాగంగా  భారత్ ఫీల్డింగ్ చేస్తున్న క్రమం లో ధోని  మైదానం లో లేకున్నా ప్రేక్షకులు ధోని ,ధోని అంటూ అరుస్తూ   స్టేడియాన్ని హోరెత్తించారు. దాంతో అభిమానులు . ధోనిని ఉదేశిస్తూ  బాహుబలి 2 లోని  నాజర్ , ప్రభాస్ మీమ్స్ కు వీడు ఎక్కడున్నా  రాజేరా అనే  డైలాగ్ ను జోడించి ట్వీట్లు  చేస్తున్నారు.  ఇక ధోని ప్రస్తుతం  రాంచి లో ఓ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాడని తెలుస్తుంది.  అన్ని కుదిరితే  వచ్చే ఏడాది జనవరి నుండి  ధోని  ని మళ్లీ భారత జట్టు తో కలిసి చూసే అవకాశాలు ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: