ఇందుకు ఉదాహరణ తాజాగా ఢిల్లీ లో ఇండియా -బంగ్లాదేశ్ లమధ్య జరిగిన మొదటి టీ 20 మ్యాచ్చే. ఈమ్యాచ్ లో భాగంగా భారత్ ఫీల్డింగ్ చేస్తున్న క్రమం లో ధోని మైదానం లో లేకున్నా ప్రేక్షకులు ధోని ,ధోని అంటూ అరుస్తూ స్టేడియాన్ని హోరెత్తించారు. దాంతో అభిమానులు . ధోనిని ఉదేశిస్తూ బాహుబలి 2 లోని నాజర్ , ప్రభాస్ మీమ్స్ కు వీడు ఎక్కడున్నా రాజేరా అనే డైలాగ్ ను జోడించి ట్వీట్లు చేస్తున్నారు. ఇక ధోని ప్రస్తుతం రాంచి లో ఓ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాడని తెలుస్తుంది. అన్ని కుదిరితే వచ్చే ఏడాది జనవరి నుండి ధోని ని మళ్లీ భారత జట్టు తో కలిసి చూసే అవకాశాలు ఉన్నాయి.