దేశవాళీ క్రికెటర్ చిదంబరం మురళీధరన్ గౌతమ్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందె ,దీనిపై గౌతమ్ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్ణాటక ప్రీమియర్ లీగ్లో ఫిక్సింగ్కు పాల్పడిన ఆరోపణలపై బెంగళూరులో పోలీసులు గౌతమ్ను అదుపులోకి తీసుకున్నారు.
గౌతమ్ తో పాటు సహచర క్రికెటర్ అయిన అబ్రార్ కాజీను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరిద్దరిపై
కర్ణాటక ప్రీమియర్ లీగ్లో బల్లారి టస్కర్స్కు ప్రాతినిథ్యం వహించారని ఫిక్సింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి. దాంతో క్రైమ్ బ్రాంచ్ విభాగం
గౌతమ్, కాజీలను అదుపులోకి తీసుకుంది. బల్లారీ టస్కర్స్కు కెప్టెన్గా వ్యవహరించిన గౌతమ్.. ఫిక్సింగ్ చేయడానికి నగదు తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ జోడికి బ్యాటింగ్ స్లోగా చేయడానికి రూ. 20 లక్షలు బుకీలు అందజేసినట్లు సమాచారం. ఫైనల్ మ్యాచ్లో వీరిద్దరూ ప్రత్యేకంగా హబ్లీతో అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది.
గతంలో దేశవాళీ టోర్నీల్లో భాగంగా
కర్ణాటక తరఫున ఆడిన
గౌతమ్,ఇప్పుడు గోవాకు మారిపోయాడు. మిజోరాం తరఫున కాజీ ఆడుతున్నాడు. కాగా, శుక్రవారం నుంచి ఆరంభం కానున్న సయ్యద్ ముస్తాక్
అలీ టీ20 ట్రోఫీలో వీరిద్దరూ తమ తమ రాష్ట్రాల తరపున జట్టులో చోటు దక్కించుకున్న సమయంలో అరెస్ట్ కావడం క్రికెట్ వర్గాల్లో మరో చర్చకు దారి తీసింది.గౌతమ్ ఎన్నో గొప్ప గొప్ప ఆటలను ఆడారు.
భారత-ఏ మాజీ ఆటగాడైన గౌతమ్.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్,
ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున కూడా ఆడాడు.
గౌతమ్ 94 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడినవారు ,ఆయన 4,716 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2013-14, 2014-15 సీజన్లో
కర్ణాటక గెలిచిన మ్యాచ్ల్లో కీలక పాత్ర పోషించాడు.ఇలాంటి సమయం లో
అరెస్ట్ కావడం
క్రికెట్ వర్గంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.