టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ వివాహం అయ్యి ముచ్చటగా మూడు సంవత్సరాలు అవుతుంది. వారి మ్యారేజ్ అయ్యినప్పటినుండి తమకి సంబందించిన సమాచారాన్ని, ఫొటోస్ లను ఎప్పటికపుడు తమ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. 2019 నవంబర్ 5న విరాట్ కోహ్లీ కి 30 సంవత్సరాలు నిండి తన 31 సంవత్సరంలోకి అడుగుపెట్టాడు.


దీంతో తన 31 పుట్టిన రోజు ని జరుపుకోవడానికి భార్యయైన అనుష్క శర్మ ని తీసుకొని భూటాన్ వెళ్ళాడు ఈ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం భూటాన్ లో ఉన్న చల్లటి మంచు కొండలపై హాయిగా హైకింగ్ చేస్తూ వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటిలాగానే తమ ఆనందకరమైన వెకేషన్ నుంచి ఫొటోస్ ని వాళ్ళ అభిమానులతో షేర్ చేస్తున్నారు. 


ఈ సందర్భం లో అనుష్క కి సంబందించిన ఒక ఇంటర్వ్యూ తెరపైకి వచ్చింది. అదేంటంటే... అనుష్క శర్మ తాజాగా వోగ్ ఇండియా మ్యాగజైన్ ఫోటో షూట్ లో పాల్గొన్నది. 'వోగ్ ఇండియా' మ్యాగజైన్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో అనుష్క శర్మ తన వ్యక్తిగత విషయాల గురించి.. ఇంకా వ్యంగం గా అనిపించే ఆమె ఛాయిసెస్ గురించి నోరు విప్పింది. 


ఈ ఇంటర్వ్యూ లో.. ఆమె విరాట్ కోహ్లీ దుస్తులను దొంగిలిస్తానని... ఎందుకంటే తన భర్తకి ఆమెను అతని డ్రెస్స్ లో చూడమంటే ఇష్టమని చెప్పింది. అలా ఆమె ఆయన డ్రెస్సెస్ వేసుకుంటే విరాట్ సంతోషిస్తాడని చెప్పుకొచ్చింది. "విరాట్ వార్‌డ్రోబ్ నుంచి నేను చాలా టీషర్ట్స్ తీసుకుంటూ ఉంటాను. వాటిని నేను వేసుకోవడానికి ఇష్టపడతాను. ఒక్కోసారి అతని జాకెట్స్ కూడా వేసుకుంటాను. నేను విరాట్ దుస్తులు వేసుకుంటే అతను చాలా సంతోషిస్తాడు," అంటూ ఇంటర్వ్యూ లో తన రహస్యాన్ని బయటపెట్టింది అనుష్క.


మరింత సమాచారం తెలుసుకోండి: