భారత ఓపెనర్
రోహిత్ శర్మ అరుదైన వరల్డ్ రికార్డ్ దగ్గరలో ఉన్నాడు. బంగ్లాదేశ్ తో రాజ్కోట్ వేదికగా గురువారం రాత్రి జరిగిన రెండో టీ - 20 మ్యాచ్ లో ఆరు సిక్సర్లు బాదిన
రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం ఇప్పటి వరకు 398 సిక్సర్ల మైలు రాయిని అందుకున్నాడు. ఇక నాగ్ పూర్ వేదికగా ఆదివారం మూడో టీ - 20 మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో
రోహిత్ శర్మ మరో రెండు సిక్సర్లు కొడితే ఇంటర్నేషనల్ క్రికెట్లో 400 సిక్సర్ల మైలురాయిని అందుకున్న మూడో ఆటగాడిగా నిలవనున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో
వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ 534 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత
పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్
షాహిద్ అఫ్రిది 476 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం
రోహిత్ శర్మ 398 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. రెండు సిక్సర్లు బాదడం ద్వారా 400 సిక్సర్ల మైలు రాయిని అందుకోవడంతో పాటు
భారత్ తరుపున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా
రోహిత్ రికార్డ్ నెలకొల్పనున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ 218 వన్డేలు ఆడిన
రోహిత్ శర్మ మొత్తం 232 సిక్సర్లు బాదేశాడు. అలానే 100 టీ - 20 ల్లో 115 సిక్సర్లు, 30 టెస్టుల్లో 51 సిక్సర్లు నమోదు చేశాడు. ఇటీవల వన్డే ప్రపంచకప్ ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సిరీస్లో పరుగుల వరద పారించిన
రోహిత్ శర్మ ఈ ఏడాదిలోనే ఏకంగా 66 సిక్సర్లు బాదేయడం చెప్పుకో తగ్గ విశేషం. ఈ రికార్డును వచ్చే మ్యాచ్ లో అందుకుంటాడో లేదో మన రోహిత్.