వచ్చే నెల లో వెస్టిండీస్ జట్టు భారత్ లో పర్యటించనుంది.  ఈపర్యటనలో భారత్  తో వెస్టిండీస్   టీ 20 , వన్డేల్లో తలపడనుంది.  మూడు  మ్యాచ్ ల  టీ 20 సిరీస్  లో  భాగంగా  డిసెంబర్ 6న  హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో ఇరు జట్ల  మధ్య మొదటి  టీ 20మ్యాచ్  జరుగనుంది.  ఈమ్యాచ్  టికెట్లు  ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చాయి. మ్యాచ్ ను ప్రత్యక్షంగా  వీక్షించాలనుకే  వారు  www.events.com లోకి  వెళ్లి  టికెట్లను  బుక్ చేసుకోవచ్చు. అలాగే  సికింద్రాబాద్ లోని  జింఖానా  గ్రౌండ్స్ లో  కూడా ఈ మ్యాచ్ టికెట్లను  విక్రయించనున్నారు.  టికెట్ల ధరలను 12,500,1000,7500,5000,4000,1500,1000,800 గా నిర్ణయించారు. 
 
 
 
ఇక  ఈమ్యాచ్  ను  విజవంతంగా నిర్వహించేందుకు  అన్నిఏర్పాట్లు   చేస్తున్నామని  మాజీ క్రికెటర్ , హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్  అధ్యక్షుడు  మహమ్మద్ అజారుద్దీన్  వెల్లడించాడు. అలాగే మ్యాచ్ కు ముందు  నిర్వహించే వేడుక కు  బీసీసీఐ అధ్యక్షుడు  గంగూలీ  తోపాటు ,బోర్డు పెద్దలు  హాజరవుతారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: