భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో కొత్త మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వెస్టిండీస్ జట్టుతో డిసెంబరు 6 నుంచి భారత్ జట్టు మూడు టీ - 20లు, మూడు వన్డేల సిరీస్ ని ఆడనుండగా ఈ సిరీస్ లో టీమిండియా మేనేజ్మెంట్ బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ లో ప్రయోగాలు చేయాలని యోచిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్పులపై సూచన ప్రాయంగా క్లారటీ ఇచ్చాడు. ముఖ్యంగా టెస్టుల్లో ఏడుగురు బ్యాట్స్మెన్లు (వికెట్ కీపర్తో కలిపి), ఐదుగురు బౌలర్ల కాంబినేషన్ తో టీమిండియా తరచూ ఆడుతుండటంపై కూడా కెప్టెన్ కింగ్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు.
టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఇటీవల చాల బలోపేతమైంది. అది ఎంతలా అంటే..? ఇప్పటి వరకూ ఆరుగురు ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ లు ఉండేవారు వారికి తోడు ఒక స్పిన్నర్ (అశ్విన్,
జడేజా) కూడా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసేవారు. కానీ, దక్షిణాఫ్రికాతో సిరీస్ నుంచి ఉమేశ్ యాదవ్ రూపంలో మరో బ్యాట్స్ మెన్ కూడా టీమిండియాలో జాయిన్ అయ్యాడు. దీనితో ఆ సంఖ్య ఇప్పుడు ఎనిమిదికి చేరింది. ఇకపై అతడిని మూడో స్థానంలో పంచ్ హిట్టర్గా బ్యాటింగ్ కి పంపిస్తాం’ అని విరాట్ కోహ్లీ నవ్వుతూ సరదాగా మాట్లాడాడు.
దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన రాంచీ టెస్టులో తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్నీ సిక్సర్లుగా మలిచిన ఉమేశ్ యాదవ్ కేవలం 10 బంతుల్లోనే 31 పరుగులు చేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ లోనూ ఉమేశ్ మెరుపులు కొనసాగించాడు. దీనితో వెస్టిండీస్ తో డిసెంబరు 6 నుంచి ప్రారంభం అయ్యే టీ - 20, వన్డే సిరీస్ కి కూడా ఉమేశ్ యాదవ్ ని ఎంపిక చేశారు టీమిండియా మేనేజ్మెంట్. మ్యాచ్ గమనానికి అనుగుణంగా హిట్టింగ్ అవసరమైన దశలో ఉమేశ్ యాదవ్ని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపే అవకాశం ఉంది. ఇటీవల బౌలింగ్ లో ఉమేశ్ అత్యుత్తమంగా రాణిస్తున్న విషయం అందరికి తెలిసిందే.