ఐపీఎల్  2020 సీజన్ కోసం  ఈనెల 19నకోల్ కత్తా లో ఐపీఎల్  వేలం  జరుగనుంది. ఎనిమిది  జట్లలో మొత్తం  73 బెర్తుల కోసం ఈ వేలంను  నిర్వహించనున్నారు. మొత్తం  971మంది  ఆటగాళ్లు ఈ వేలంలో  అందుబాటులో ఉండనున్నారు.  ఇందులో 713 మంది భారత ప్లేయర్లు ఉండగా 215మంది విదేశీ ప్లేయర్లు వున్నారు. ఇక   ఈ వేలం లో  అత్యధిక  బేస్  ప్రైస్  తో  15 మంది ఆటగాళ్లు  అందుబాటులో వుండనున్నారు. ఈజాబితాలో  భారత్ నుండి  కేవలం ఒకే ఒక్క ఆటగాడు రాబిన్ ఉతప్ప  స్థానం సంపాదించాడు. 
 
ఈవేలం లో  అత్యధిక  బేస్ ప్రైస్ కలిగిన ఆటగాళ్లు  : 
 
ప్లేయర్                     బేస్ ప్రైస్  
పాట్ కమిన్స్               2 కోట్లు
జోష్ హేజెల్ వుడ్        2 కోట్లు 
మాక్స్ వెల్                  2 కోట్లు 
క్రిస్ లిన్                      2 కోట్లు 
మిచెల్ మార్ష్               2 కోట్లు 
డేల్ స్టెయిన్               2 కోట్లు 
ఏంజెలో మాథ్యూస్‌      2 కోట్లు 
ఇయాన్ మోర్గాన్          2 కోట్లు 
జాసన్ రాయ్                1.5 కోట్లు 
రాబిన్ ఉతప్ప             1.5 కోట్లు 
షాన్ మార్ష్                    1.5 కోట్లు 
కైల్ అబాట్                   1.5 కోట్లు 
క్రిస్ మోరిస్                   1.5 కోట్లు 
క్రిస్ వోక్స్                      1.5 కోట్లు 
డేవిడ్ విల్లీ                     1.5 కోట్లు 
కేన్ రిచర్డ్ సన్                1.5 కోట్లు 
 
 
 
వీరిలో  కమ్మిన్స్ , మోర్గాన్ , మాక్స్ వెల్ ,జాసన్ రాయ్ ,క్రిస్ లిన్  బేస్ ప్రైస్ కంటే   ఎక్కువ ధరకు అమ్ముడుపోనున్నారు.  మరి  మిగిలిన ఆటగాళ్లను కూడా  బేస్ ప్రైస్  కు సొంతం చేసుకుంటారో లేదో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: