హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ గత కొంత కాలంగా భారత యూత్‌ జట్టు సభ్యుడిగా నిలకడగా రాణిస్తున్నాడు .అతనికి  మరో అరుదైన అవకాశం లభించింది. అండర్‌–19 వచ్చే నెలలో జరిగనుంది . భారత జట్టు నుంచి ప్రపంచ కప్‌లో పాల్గొనే అవకాశం  అతను కొట్టేసారు . 86.56 సగటుతో 779 పరుగులు 2018–19 సీజన్‌ కూచ్‌బెహర్‌ ట్రోఫీలో తిలక్‌ 6 మ్యాచ్‌లలో  చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇందులో 4 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత 84.50 సగటుతో 8 మ్యాచ్‌లలో 507 పరుగులు వన్డే టోర్నీ వినూ మన్కడ్‌ ట్రోఫీలో కూడా  సాధించాడు.

 

 అతనికి ఈ ప్రదర్శనే భారత అండర్‌–19 టీమ్‌లో రెగ్యులర్‌గా మారేందుకు కారణమైంది. తిలక్‌  ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ ఆడాడు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు దక్షిణాఫ్రికాలో  వరల్డ్‌ కప్‌ జరుగుతుంది. ఇందు కోసం భారత జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ 15 మంది సభ్యుల జట్టును  ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రియమ్‌ గార్గ్‌ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపిక కాగా... యూపీకే చెందిన ధ్రువ్‌ జురేల్‌  వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

 

రెగ్యులర్‌ సభ్యుడిగా యూపీ సీనియర్‌ జట్టులో ఇప్పటికే  ఉన్న ప్రియమ్‌ 2018–19 రంజీ సీజన్‌లో 814 పరుగులతో సత్తా చాటాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో డబుల్‌ సెంచరీ సహా అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగుతున్న ముంబై ఆటగాడు యశస్వి జైస్వాల్‌ కూడా ప్రపంచ కప్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అండర్‌–19 ప్రపంచ కప్‌లో 16 జట్లు పాల్గొంటాయి.

 

నాలుగు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు సూపర్‌ లీగ్‌ దశకు అర్హత సాధిస్తాయి. నాలుగు సార్లు (2000, 2008, 2012, 2018) అండర్‌–19 ప్రపంచ కప్‌ విజేతగా నిలిచిన భారత్‌ ఈ సారి గ్రూప్‌ ‘ఎ’లో న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్‌లతో కలిసి బరిలోకి దిగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: