టెస్టుల్లో  ఒక్క ఓటమి కూడా లేకుండా  ఈఏడాదిని ముగించనుంది టీమిండియా.  ఈ ఏడాది లో  టెస్టు అర్హత  కలిగిన  జట్లు  కనీసం ఒక్క మ్యాచ్ లోనైనా  ఓటమి ని చవి చూడగా  టీమిండియా మాత్రం  ఓటమి  లేకుండా  నెంబర్ 1 ర్యాంక్  ను నిలబెట్టుకుంటూ  రికార్డు సృష్టించింది.  అలాగే  వరుసగా  స్వదేశం లో  12 టెస్టు సిరీసులు గెలిచి  భారత్ ప్రపంచ రికార్డు  నెలకొల్పింది. ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా  ఇప్పటివరకు భారత్ 7మ్యాచ్ లు ఆడగా అన్నింట్లో గెలిచి 360 పాయింట్ల తో  ఎవరికి అందనంత దూరంలో  నిలిచింది. 
 
 
అయితే వచ్చే ఏడాది  టీమిండియా  కు అసలు సిసలైన  పరీక్ష ఎదురుకానుంది. న్యూజిలాండ్  పర్యటనలో భాగంగా  ఫిబ్రవరి లో ఆ జట్టు తో  టెస్టు సిరీస్ ఆడాల్సివుంది.  ఇక ప్రస్తుతం  వెస్టిండీస్  తో టీ 20సిరీస్ కు సన్నద్ధం అవుతుంది టీమిండియా. ఈనెల  6న ఉప్పల్ లో  ఇరు జట్ల మధ్య  మొదటి టీ 20మ్యాచ్  జరుగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: