ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ నుండి సంచలన ఫామ్ తో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ టాప్ క్రికెటర్ గా వెలుగొందుతున్న టీమిండియా ఓపెనర్ , హిట్ మ్యాన్
రోహిత్ శర్మ తాజాగా మరో రికార్డు పై కన్నేశాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. కేవలం ఒక్క సిక్స్ కొడితే చాలు
అంతర్జాతీయ క్రికెట్ లో 400 సిక్సులు కొట్టిన మొదటి క్రికెటర్ గా రోహిత్
చరిత్ర సృష్టించనున్నాడు.
ఈనెల 6న ఉప్పల్ లో భారత్ -వెస్టిండీస్ ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో రోహిత్ ఈఫీట్ ను సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈమ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. ఇప్పటికే రెండు జట్లు ఉప్పల్ లో సాధన కూడా ప్రారంభించాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది యాహూ లో మోస్ట్ సెర్చ్డ్ స్పోర్ట్స్ పర్సనాలిటి జాబితాలో ధోని తరువాత రోహిత్ శర్మ రెండవ స్థానం లో నిలిచాడు. కాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడవ స్థానం తో సరిపెట్టుకున్నాడు.