అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గత కొంత కాలంగా పదేపదే ఫీల్డ్ అంపైర్లు నో బాల్స్ను గుర్తించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గురువారం ఐసీసీ ఇక నుంచి థర్డ్ అంపైర్కే ఫ్రంట్ ఫుట్ నోబాల్స్ను గుర్తించే బాధ్యతను అప్పగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనిని టీ20, వన్డే సిరీస్లలో ట్రయల్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో భారత్-వెస్టిండీస్ల మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ శుక్రవారం జరగనుంది. దీనిని అప్పటినుంచే ఈ కొత్త నిబంధనకు అంకురార్పణ జరగనుంది. ఈ నిబంధనను ఈ సిరీస్లతో పాటు కొన్ని నెలలు పరిశీలించి తర్వాత పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
‘ థర్డ్ అంపైర్ ఫ్రంట్ ఫుట్ బాల్ నోబాల్స్ను ఈ నిబంధన ప్రకారం గుర్తించి ఫీల్డ్ అంపైర్కు సూచిస్తాడు. అదేవిధంగా ఫీల్డ్ అంపైర్ థర్డ్అంపైర్తో చర్చించకుండా నోబాల్స్ను ప్రకటించకూడదు.ఐసీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ ... థర్డ్ అంపైర్ఒక వేళ బ్యాట్స్మన్ ఔటైన బంతి నోబాల్ అని ప్రకటిస్తే ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ ఒక్క నిబంధన మినహా ఫీల్డ్ అంపైర్కు ఉండే విధులు, బాధ్యతలు అలాగే కొనసాగుతాయి’అంటూ ఐసీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నాడు.
గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో నో బాల్స్ అంశంలో వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఏకంగా 21 ఫ్రంట్ ఫుట్ నోబాల్స్ను బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేకపోయారు. దీంతో అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై అంపైర్లు సెకన్ కాలంలో నోబాల్, బాల్ లెంగ్త్, దిశ, ఎల్బీడబ్ల్యూ వంటివి గమనించడం కష్టతరంగా మారిందని చెప్పుకొచ్చారు . దీంతో థర్డ్ అంపైర్కు ఈ బాధ్యతను అప్పగించాలని పలువురు సూచించారు. దీంతో నోబాల్ అంశాన్ని కొన్ని నెలల పాటు థర్డ్ అంపైర్కు అప్పగించాలని ఐసీసీ భావించి ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే మాజీ ఆసీస్ అంపైర్ సైమన్ టఫెల్ ఈ నిర్ణయంపై స్పందించాడు . ఇప్పటికే థర్డ్ అంపైర్లపై డీఆర్ఎస్, రనౌట్స్ వంటి కీలక విధులు నిర్వర్తిస్తున్నారు . ఈ నిబంధన మరింత భారం పెంచేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ట్రయల్స్ విజయవంతం అయితే భవిష్యత్లో నోబాల్స్కు సంబంధించి పూర్తి బాధ్యతలు థర్డ్ అంపైర్కే అప్పగించే అవకాశం ఉంది.