టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు .కోహ్లీ తన బ్యాట్తో పరుగుల వరద పారించే విధంగా వున్నాడు. ఈ మధ్య కాలంలో నిత్యం ఏదో రకమైన విషయాలతో కోహ్లీ వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే తొలి టీ20 మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్తో జరిగినది ఈ మ్యాచ్ లో మరోసారి ఓ అరుదైన సంఘటనతో వార్తల్లోకెక్కాడు.
ఇంతకీ విషయం ఏంటంటే.. శుక్రవారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లోసోషల్ మీడియాలో ప్రత్యర్థి ఆటగాడు విలియమ్స్ను ఉద్దేశించి కోహ్లి తన చేతిని వర్చువల్ 'నోట్బుక్'గా మార్చి.. బుక్ తీసి టిక్ కొడుతున్నట్లు చేసిన విన్యాసం వైరల్గా మారింది. దీనిపై ఫ్యాన్స్ స్పందించి గతంలో ఓ మ్యాచ్ సందర్భంగా తన వికెట్ తీసి సంబరాలు చేసుకున్నవిలియమ్స్కు అదే రీతిలో కౌంటర్ ఇచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు విజయానికి 30 బంతుల్లో 54 పరుగులు కావాల్సిన సమయంలో.. కోహ్లీ క్రీజులో ఉండటంతో మ్యాచ్ అప్పటికీ టీమిండియా చేతిలోనే ఉంది. విలియమ్స్ 16వ ఓవర్లో రెండో బంతిని అతని తలపై నుంచి కోహ్లి నేరుగా బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతిని లాంగాన్లో కళ్లు చెదిరే సిక్సర్గా మలిచాడు.
కోహ్లి సిక్సర్ కొట్టిన తర్వాత అదే నోట్బుక్ స్టయిల్లో ఆ మూమెంట్ను బాగా ఎంజాయ్ చేశాడు. దీంతో కోహ్లీ జేబులో నుంచి నోట్బుక్ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీనిపై విరాట్ మాట్లాడుతూ.. గత వెస్టిండీస్ పర్యటనలో తనని ఔట్ చేసినపుడు విలియమ్స్ చేసిన సెలబ్రేషన్స్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇలా బదులిచ్చినట్లు వ్యాఖ్యానించాడు. కాగా ఈ మ్యాచ్లో 50 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 94 పరుగులతో నాటౌట్గా విరాట్కోహ్లి నిలిచాడు.
కోహ్లీకి టీ20ల్లో ఇది 23వ హాఫ్ సెంచరీ. తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో టీమిండియా మూడు టి20ల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇక డిసెంబరు 8న రెండో టి20 మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది.