మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా ఇండియా-వెస్టిండీస్ జట్ల మధ్య ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య తిరువనంతపురం లో ఈరోజు రెండో టీ20 జరగనుంది. దాంతో
కేరళ వాసుల చూపంతా
యువ వికెట్ కీపర్, లోకల్ బాయ్
సంజు శాంసన్ పైనే వుంది. సొంతం మైదానం లో జరిగే ఈమ్యాచ్ కైనా సంజు ను తుది జట్టులోకి తీసుకోవాలని
కేరళ క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం జింబాంబ్వే తో టీ 20 మ్యాచ్ ఆడిన సంజు కు ఇప్పటివరకు మరో అవకాశం రాలేదు. ఇటీవల
బంగ్లాదేశ్ తో టీ 20సిరీస్ కు ఎంపికైన అందులో కనీసం ఒక్క మ్యాచ్ లో ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు.
ఆతరువాత విండీస్ సిరీస్ కు ఎంపికేచేయలేదు. అయితే
శిఖర్ ధావన్ గాయం తో తప్పుకోవడంతో సంజు కు ఛాన్స్ వచ్చింది. అయితే ఈ సిరీస్ లో మొదటి
టీ20 లో మళ్ళీ బెంచ్ కే పరిమితం అయ్యాడు. ఇక ఈ మ్యాచ్ లో కూడా సంజు కు అవకాశం దక్కడం కష్టమే. ఎందుకంటే భారత జట్టు యాజమాన్యం
రిషబ్ పంత్ వైపే మొగ్గు చూపుతుంది. ఒకవేళ సంజుకు ఛాన్స్ ఇవ్వాలంటే శివమ్ దూబే ను పక్కకు పెట్టాలి. మరి ఆ నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి. ఎలాగైనా సంజు మాత్రం తుది జట్టులో ఉండాలని కేరళీయులు బలంగా కోరుకుంటున్నారు.