క్రికెట్‌లో ఎన్నో రికార్డులు ,ప్రపంచం గుర్తించే విధంగా గొప్ప ఆటగాడిగా పేరుప్రఖ్యాతలు సంపాందించుకున్నారు   మిస్టర్ పర్ఫెక్ట్ ధోని .ఒట్టి  క్రికెట్‌లో మాత్రమే కాకుండా తనవంతు దేశానికి ఏదో విధంగా సహాయం చేయాలనీ తన పట్ల వున్న దేశభక్తి ని ఇండియన్ ఆర్మీ లో చేరినపుడే మనందరికి తెలిసింది అంతేకాదు ఇండియన్ ఆర్మీపై ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని ప్రతిసారి చాటుకుంటూ వచ్చారు  .  

 

ప్రపంచకప్‌ తర్వాత ఎంఎస్‌ ధోని బ్యాట్‌ పట్టలేదు.  రెండు నెలలు సైన్యంలో పనిచేయాలంటూనే ఆ పని పూర్తయినా.. ఇంకా తన విరామాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే  కూతురు జీవా, భార్య సాక్షితో సరదాగా వివిధ ప్రదేశాలను ఈ విరామ సమయంలో చుట్టేస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవాన్ని పొందారు ప్రస్తుతం మరో అడుగు  మన సైనికుల కోసం ముందుకు వేయబోతున్నాడు.

 

ఎంఎస్‌ ధోని వారితో కలిసి కొంత కాలం పనిచేసినపుడు సైనికుల సమస్యల మీద కొంత అవగాహన ఆయనకు  ఏర్పడడంతో..  ఎన్నో  కష్టాలు  సైనికులు  , వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలని  తెలియజేసేందుకు సొంతంగా ఒక టీవీ షోని నిర్మించేందుకు ధోని సిద్దమయ్యాడు.ఇంతవరకు ఇలా సైనికుల కష్టాలను తీర్చే విధంగా  ఎటువంటి షో  ఇప్పటివరకు లేదు .

 

ఈ షో  భారతదేశ సాయుధ దళాల పనితనాన్ని అలాగే వారు దేశం కోసం చేసిన, చేస్తున్న కృషిని గురించి అందరికీ తెలియచేసేలా నిర్వహించనున్నారని తెలుస్తోంది.ఒక క్రికెటర్ గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి పనికి సిద్దమవడం విశేషం.ఈ  షో  స్టార్ ప్లస్‌లో టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ షో ఇంకా మొదలవ్వకముందే జనాల్లో  హాట్ టాపిక్‌గా మారింది. ధోని నిర్మిస్తున్న ఈ షో సోనీ టీవీలో ప్రసారం అయ్యే అవకాశాలున్నాయి. కాగా..ధోని గత కొద్ది కాలంగా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.

రతిసారి చాటుకుంటూ వచ్చారు .

మరింత సమాచారం తెలుసుకోండి: