ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్స్న్ టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్కు పలు విధాలుగా సూచనలిచ్చాడు. గత కొంత కాలంగా బ్యాటింగ్లో టీమిండియాకు నాలుగో స్థానం నిలిచింది .దింతో ముందుముందుకు పలు రకాల ఇబ్బందులకు గురిచేస్తోందని భావిస్తున్నారు , ఇప్పటికే పలువురు ఆటగాళ్లకు చాలా సార్లు అవకాశం ఇచ్చినా దానికి తగట్టు ఫలితం దక్కలేదన్నాడు. కానీ అయ్యర్ అయితే నాలుగో స్థానానికి సరిగ్గా ఒదిగిపోతాడని పీటరన్స్ అభిప్రాయపడ్డాడు.
అంతేకాకుండా పీటరన్స్ అయితే అయ్యర్ బ్యాటింగ్ టెక్నిక్లో కొన్ని లోపాలున్నాయని వాటిని ఆయన సరిదిద్దుకోవాలని సూచించాడు. ఇదికగా ముఖ్యంగా ఈ యువ క్రికెటర్ ఆఫ్ సైడ్ బ్యాటింగ్పై దృష్టి పెట్టాలన్నాడు. దీనికోసం నెట్స్లో ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయాలి అని తెలియచేశాడు . అంతేకాకుండా ఎలా ప్రాక్టీస్ చేయాలో ఆ విధానాన్ని కూడా వివరించాడు . ప్రత్యేకంగా నెట్స్లో ఓ బౌలర్చే ఆఫ్ స్టంప్ బంతులు వేయించుకొని ప్రాక్టీస్ చేయాలన్నాడు. అదేవిధంగా ఎక్స్ట్రా కవర్ షాట్లపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని పీటర్సన్ పేర్కొన్నాడు.
ఇక టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్యణ్ చివరి టీ20లో బంగ్లాదేశ్తో జరిగినది ఇందులో అయ్యర్(33 బంతుల్లో 62) అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. ఆ మ్యాచ్లో ఈ యంగ్ క్రికెటర్ రాణించడంతోనే టీమిండియా చాలా సులువుగా గెలిచిందని అభిప్రాయపడ్డాడు. అయ్యర్ ఎంతో ప్రతిభావంతుడని, భవిష్యత్లో టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక లక్ష్మణ్ వెస్టిండీస్తో జరిగిన రెండు టీ20ల్లో అయ్యర్ అంతగా రాణించనప్పటికీ ముంబై వేదికగా జరిగే నిర్ణయాత్మకమైన మ్యాచ్లో తప్పక రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.
ఇక తిరువనంతపురం వేదికగా విండీస్తో జరిగిన మ్యాచ్లో అయ్యర్ తీవ్రంగా నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే. ఇక బుధవారం ముంబై వాంఖడే స్టేడియం వేదికగ టీమిండియా-వెస్టిండీస్ జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 జరగనుంది.