పాకిస్తాన్‌ గడ్డపై  దాదాపు దశాబ్దం అనంతరం అంతర్జాతీయ టెస్టు జరగనుంది.  శ్రీలంక-పాక్‌ జట్ల మధ్య చారిత్రాత్మక తొలి టెస్టు బుధవారం నుంచి ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి  మాట్లాడాడు.

 

అత్యంత సురక్షితమైన ప్రాంతం పాకిస్తాన్‌  , నిరభ్యంతరంగా క్రికెట్‌ ఈ గడ్డపై  ఆడొచ్చనే సందేశాన్ని ఈ సిరీస్‌తో ప్రపంచానికి చాటి చెబుతామని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇప్పటినుంచి తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడబోమని, ఇక నుంచి తమతో ఆడాలనుకుంటే పాకిస్తాన్‌కే రావాలని స్పష్టం చేశాడు.  ఎహ్‌సాన్‌ మణి  ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో స్వదేశంలో మరో రెండుమూడేళ్లలో సిరీస్‌లు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

 

ఇప్పటికే కొంతమంది ప్లేయర్స్‌ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌కు చెందిన  తమ దేశంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారన్నారు. క్రికెట్‌ ఐర్లాండ్‌ సీఈఓ పాక్‌స్తాన్‌లో ఆడకుండా ఉండేందుకు తమకు కారణాలు దొరకడం లేదని  తమతో అన్నట్లు వివరించాడు. ఇంగ్లండ్‌తో 2021లో ,  ఆసీస్‌తో 2021లో  పాక్‌లో సిరీస్‌లు నిర్వహిస్తామని, అదేవిధంగా వీలైతే 2023-24లో న్యూజిలాండ్‌తో సిరీస్‌ నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. యావత్‌ దేశం రావల్పిండి వేదికగా ఆరంభం కానున్న తొలి టెస్టుపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నాడు.  ఈ మ్యాచ్‌ టికెట్లలో అధిక శాతం స్థానిక స్కూల్‌, కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపాడు. 

 

ఇక రెండు లంక-పాక్‌ల మధ్య బుధవారం నుంచి తొలి టెస్ట్‌ టెస్టుల సిరీస్‌లో భాగంగా  ఆరంభం కానుంది. అనంతరం రెండో టెస్టు డిసెంబర్‌ 19 నుంచి 23 వరకు  జరగనుంది. ఇక చివరగా  శ్రీలంక పాక్‌లో 2009లో పర్యటించినప్పుడు వారు ప్రయాణిస్తున్న బస్సుపై టెర్రర్‌ అటాక్‌ జరిగిన విషయం తెలిసిందే.  లంక ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతం అనంతరం ఏ దేశం కూడా పాక్‌లో పర్యటించడానికి ధైర్యం చేయలేదు. తిరిగి శ్రీలంకతోనే పాక్‌లో క్రికెట్‌ పునరుజ్జీవనం పోసుకోవడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: