వెస్టిండీస్‌తో వాంఖడే వేదికగా నేడు జరుగుతున్న ఆఖరి టీ - 20 మ్యాచ్‌ లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను  సాధించాడు. నేటి మ్యాచ్‌ లో ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ లో ఫాస్ట్ బౌలర్ కాట్రెల్ బౌలింగ్‌ లో మిడ్ వికెట్ దిశగా అదిరిపోయే  సిక్స్ బాదిన రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌ లో 400 సిక్సర్లు నమోదు చేసిన తొలి భారత క్రికెటర్‌ గా రికార్డ్ ను నెలకొల్పాడు. వరల్డ్ క్రికెట్‌ లో ఇప్పటి వరకూ క్రిస్‌ గేల్, అఫ్రిది మాత్రమే ఈ 400 సిక్సర్ల మార్క్‌ ని అందుకున్న లిస్ట్ లో ఉన్నారు.

 

 

అంతర్జాతీయ క్రికెట్‌ లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాని ఓసారి చూస్తే వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్‌ గేల్ మొత్తం 462 మ్యాచ్‌ల్లో 534 సిక్సర్లు నమోదు చేయగా, ఆ తర్వాత పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది తను ఆడిన 524 మ్యాచ్‌ల్లో 476 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 

 

 

అయితే 354వ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ 400 సిక్సర్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. సుదీర్ఘ కెరీర్‌ లో 218 వన్డేలు ఆడిన రోహిత్ శర్మ 232 సిక్సర్లు, 104 టీ - 20 ల్లో 116 సిక్సర్లు, 32 టెస్టుల్లో 52 సిక్సర్లు నమోదు చేశాడు.

 

 

ఇదంతా ఇలా ఉండగా భారత్ క్రికెట్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా , మహేంద్రసింగ్ ధోని 359 సిక్సర్లు (538 మ్యాచ్‌లు), సచిన్ టెండూల్కర్ 264 సిక్సర్లు (664 మ్యాచ్‌ల్లో) టాప్ -3 లిస్టులో ఉన్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 398 మ్యాచ్‌ల్లో 206 సిక్సర్లతో ఉన్నాడు. ప్రస్తుతానికి మ్యాచ్ స్కోర్ వచ్చే సరికి 13 ఓవర్లలో 142 పరుగులు చేసి 2  వికెట్లు కోల్పోయింది భారత్. క్రీజులో రాహుల్, కెప్టె కోహ్లీ ఆడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: