నిజానికి మూడో టీ20 మ్యాచ్  సిరీస్‌ విజేతను డిసైడ్‌ చేస్తుంది దీనీ కోసం టీమిండియా, వెస్టిండీస్‌ జట్టు సిద్దమయ్యాయి.  ఈ మ్యాచ్‌పై ముంబై వాంఖెడే వేదికగా జరుగుతున్నఅందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కోహ్లి సేన  తొలి మ్యాచ్‌లో గెలిచిన కానీ రెండో టీ20లో చతికిలపడింది. అయితే ఈ సారి జరగబోయే సిరీస్‌ను ఎలాగైన చివరి మ్యాచ్‌లో గెలిచి విజయాన్ని కైవసం చేసుకోవాలని ఆరాటపడుతోంది.

 

ఇకపొలార్డ్‌ అండ్‌ గ్యాంగ్‌  రెండో మ్యాచ్‌లో గెలుపుతో ఆత్మవిశ్వాసంతో వుంది ఈ గ్యాంగ్ ఎలాగైనా  సరే  ముంబై మ్యాచ్‌ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ విజయవంతగా టాస్‌ గెలిచినది.వీరు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఛేజింగ్‌కు వాంఖెడే పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో పాటు సులువు అవుతుందనే ఉద్దేశంతో పొలార్డ్‌ టాస్‌ గెలిచిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. 


ఇక  టీమిండియా ఈ మ్యాచ్‌ కోసం రెండు కీలక మార్పులు చేసింది. మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌లను తుది జట్టులోకి తీసుకుంది.   కాగా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, మణికట్టు స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌లను అనూహ్యంగా ఏమి ఆలోచించకుండా పక్కకు పెట్టినట్టు తెలుస్తుంది . అయితే వాషింగ్టన్‌ సుందర్‌ను కూడా పక్కన పెట్టారని అందరూ  అనుకుంటున్నారు  కానీ నిజానికి  అందరూ ఊహించనట్టు  పక్కకు పెట్టలేదు.  మరోసారి అతడికి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ గొప్ప అవకాశాన్ని  కల్పించింది.

 

ఇది ఇలావుండగా మరోవైపు విండీస్‌ జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. గత మ్యాచ్‌ విన్నింగ్‌ టీమ్‌తోనే ముంబై మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతోంది. ఇక ఈ మైదానంలో విజయావకాశాలు  రెండో సారి బ్యాటింగ్‌  చేసిన జట్టుకేఎక్కువని గత రికార్డులు పేర్కొంటున్నాయి. చివరి ఆరు టీ20 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఐదు మ్యాచ్‌ల్లో ఛేజింగ్‌ చేసిన జట్టే విజయం సాధించింది. దీంతో మ్యాచ్‌పై ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో అని మరింత ఆసక్తి అందరిలో పెరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: