మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ప్రస్తుత భారత క్రికెట్లో శ్రేయస్ అయ్యర్ ఎంతో నాణ్యమైన ఆటగాడని పేర్కొన్నాడు. కానీ కుంబ్లే టీమిండియా మేనేజ్మెంట్ అతని సేవల్ని పూర్తిగా వినియోగించుకోవడంలో విఫలం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశాడు.
కుంబ్లే ప్రధానంగా పదే పదే అయ్యర్ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడాన్ని తప్పుబట్టాడు.అంతేకాకుండా ఇంకో విషయాన్నీ కూడా అయన బయటపెట్టాడు అయ్యర్ను వెస్టిండీస్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో ఐదు,ఆరు స్థానాల్లో పంపడాన్ని ప్రస్తావించాడు. నిజానికి అయ్యర్ను ఆ స్థానాల్లో పంపడం సరైనది కాదనిఆయన స్పష్టం చేశాడు. ఒక క్వాలిటీ ఆటగాడైన అయ్యర్కు కీలకమైన నాల్గో స్థానమే కరెక్ట్ అని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
ఇక అయ్యర్ను రాబోవు వన్డే సిరీస్లో నాల్గో స్థానంలో పంపాలని కుంబ్లే సూచించాడు. ‘ శిఖర్ ధావన్ జట్టులో లేని కారణంగా కేఎల్ రాహుల్కు మళ్లీ ఓపెనింగ్ చాన్స్ చేసే అవకాశం వచ్చింది. దాంతో అయ్యర్ను నాల్గో స్థానంలో బ్యాటింగ్కు పంపడానికి ఆస్కారం ఉంటుంది అని ఆయన పేర్కొన్నాడు . ప్రతి సారి మనం అయ్యర్ ఆటను చూస్తునే ఉన్నాం. అతను అత్యంత నిలకడగా నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నాడు. దింతో కుంబ్లే అతన్ని మళ్లీ నాల్గో స్థానంలో చూడాలనుకుంటున్నా’ అనిపేర్కొన్నాడు.
కాగా, కుంబ్లే విండీస్ వన్డే సిరీస్ కఠినంగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు . లో పవర్ఫుల్ హిట్టర్లు అంతా విండీస్ జట్టులో ఉన్నారని, దాంతో మన వన్డే బౌలింగ్లో మరింత పదును పెరగాలన్నాడు. తొలి టీ20లో వెస్టిండీస్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అయ్యర్ నాలుగు పరుగులే చేశాడు. ఇక రెండో టీ20లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. చివరి టీ20లో అయ్యర్ ఇంకా రెండు బంతులు మాత్రమే ఉండగా ఐదో స్థానంలో బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది. దాంతో స్టైకింగ్ చేసే అవకాశం రాలేదు.