భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఆగస్టులో విశ్వవిజేతగా అవతరించాక ఆడిన ఆరు టోర్నీల్లోనూ అంతగా ఆకట్టుకోలేకపోయిన  సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లోనూ తడబడింది. ఈ ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి  వరుసగా రెండో పరాజయం చవిచూసి ఈ టోర్నీ లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. సింధు నేడు జరిగే మూడో లీగ్‌ మ్యాచ్‌లో గెలిస్తే ఆమెకు సీజన్‌ను విజయంతో ముగించిన ఊరట లభిస్తుంది.

 

భారత స్టార్‌ పీవీ సింధు గత రెండేళ్లలో బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో టైటిల్‌ పోరుకు చేరడంతోపాటు గతేడాది చాంపియన్‌గా కూడా నిలిచినది ఐతే ఈసారి మాత్రం నిరాశ పరిచింది.నిజానికి సెమీఫైనల్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సింధు పోరాడి ఓడిపోయింది.

 

గురువారం ప్రపంచ రెండో ర్యాంకర్‌ చెన్‌ యుఫె (చైనా)తో  జరిగిన గ్రూప్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో  22–20, 16–21, 12–21తో ప్రపంచ చాంపియన్‌ సింధు ఓటమి చవిచూసింది.మ్యాచ్ మొదట్లో  సింధు 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో 17–20తో వెనుకబడింది.సింధు దింతో   ఒక్క సారిగా  తన సత్తా చాటుకుంది .అయితే ఒక్కసారిగా విజృంభించిన సింధు వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను 22–20తో దక్కించుకుంది.

 

అయితే ఈ ఏడాది చెన్‌ యుఫె రెండో గేమ్‌లో ఆరు సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన  పుంజుకుంది. నిజానికి  ఆరంభంలోనే 8–4తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచింది.   చెన్‌ యుఫె  నిర్ణాయక మూడో గేమ్‌లోతన దూకుడు కొనసాగించి ఆట సింధుకట్టించింది. మరో మ్యాచ్‌లో అకానె యామగుచి 25–27, 21–10, 21–13తో హి బింగ్‌జియావో (చైనా)పై గెలిచింది. గ్రూప్‌ ‘ఎ’లో రెండేసి మ్యాచ్‌లు నెగ్గినందుకు చెన్‌ యుఫె, యామగుచి సెమీఫైనల్‌కు చేరారు. నేడు జరిగే నామమాత్రపు మ్యాచ్‌ల్లో హి బింగ్‌జియావోతో సింధు  యామగుచితో చెన్‌ యుఫె తలపడతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: