భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వచ్చే ఏడాది జరగనున్న టీ - 20 ప్రపంచకప్‌ లో తప్పకుండా ఆడతాడని వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్ డ్వేన్ బ్రావో తెలిపాడు. ఈ సంవత్సరం జులైలో వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియాకి దూరంగా ఉంటున్న ధోనీ, కనీసం టీమ్ సెలక్షన్‌ కి కూడా అందుబాటులో లేడు. దీనితో అతను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వార్తలు విస్తున్నాయి. కానీ ఆ వార్తలపై ధోనీ ఇప్పటి వరకూ ఏమి మాట్లాడలేదు. మరోవైపు ధోనీ భవితవ్యంపై భారత సెలక్టర్లతో పాటు టీమిండియా మేనేజ్మెంట్‌ కూడా ఓ క్లారిటీ లేదు. 

 

అయితే ఇది ఇలా ఉండగా ధోనీ భవితవ్యంపై తాజాగా డ్వేన్ బ్రావో మాట్లాడుతూ ధోనీ ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించడు, కావున వచ్చే ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న టీ - 20 ప్రపంచకప్‌ లో అతను తప్పకుండా ఆడతాడు. ఇక విమర్శలు, రూమర్స్ అని అంటారా..? అవి ఎప్పుడూ ధోనీని కాస్త కూడా ప్రభావితం చేయలేవు. క్రికెట్‌ బయటి అంశాలకి చింతిచొద్దు.. నీ సామర్థ్యాల్ని నమ్ముకో అని ధోనీ తరచూ టీం సభ్యులతో చెప్తూ ఉంటాడన్నాడు. తను కూడా క్రికెటేతర అంశాల గురించి ఎప్పుడూ ఆలోచించడు అని డ్వేన్ బ్రావో తెలిపాడు. గత సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్‌ కి రిటైర్మెంట్ ప్రకటించిన డ్వేన్ బ్రావో మళ్లీ ఆ రిటైర్మెంట్ నిర్ణయాన్ని శుక్రవారం వెనక్కి తీసుకున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే తాను అంతర్జాతీయ టీ - 20 ల్లో మాత్రమే ఆడతానని బ్రావో తెలిపాడు.

 

ఐపీఎల్‌ లో చెన్నై సూపర్ కింగ్స్‌ కి ఆడుతున్న డ్వేన్ బ్రావో సుదీర్ఘకాలంగా ధోనీతో మంచి స్నేహం ఉంది. వెస్టిండీస్‌ పర్యటనకి వెళ్లిన సమయంలో బ్రావో ఇంటికి ధోనీ ఫ్యామిలీతో కలిసి భోజనానికి కూడా వెళ్లాడు. అలానే ఐపీఎల్‌ సమయంలో వీరిద్దరూ మైదానంలో చాలా వరకు సరదాగా కనిపిస్తుంటారు. 2017 లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ నిషేధంలో ఉండగా, డ్వేన్ బ్రావో (గుజరాత్ లయన్స్), ధోనీ (రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్)‌ ప్రత్యర్థులుగా ఆడారు. ఆ సమయంలో బ్రావో బౌలింగ్‌లో ధోనీ హిట్టింగ్ చేయగా, అతను సరదాగా ధోనీని కవ్వించే ప్రయత్నం కూడా చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే సమయంలోనూ వీరిద్దరూ ఎదురుపడితే అక్కడ కూడా సరదాగా వాతావరణం నెలకొనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: